Begin typing your search above and press return to search.

గ్రీన్ ఇండియా చాలెంజ్.. రోజా చొరవ.. నాటిన అర్జున్

By:  Tupaki Desk   |   23 Feb 2020 12:33 PM GMT
గ్రీన్ ఇండియా చాలెంజ్.. రోజా చొరవ.. నాటిన అర్జున్
X
గ్రీన్ ఇండియా చాలెంజ్ లో సెలెబ్రెటీలు చురకుగా పాల్గొంటున్నారు.టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగిన పల్లి సంతోష్ కుమార్ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించిన ‘హరితహారాన్ని’ స్ఫూర్తిగా తీసుకొని మొదలు పెట్టిన ఈ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోంది.

ఈ చాలెంజ్ ను వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా స్వీకరించి మొక్కలు నాటారు. ఆమె తాజాగా సీనియర్ హీరో అర్జున్ కు ఈ చాలెంజ్ విసిరారు. తాజాగా రోజా, వనం ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో సినిమా హీరో అర్జున్ తన నివాసంలో మొక్కలు నాటారు. తమిళనాడులోని గెరుంబాకంలో ఉన్న అర్జున్ గార్డెన్ క్యూ2లో రోజాతోపాటు అర్జున్ మూడు మొక్కలు నాటారు. అనంతరం ఈ చాలెంజ్ లో భాగంగా మరో ముగ్గురిని నామినేట్ చేశారు.

హీరో అర్జున్ కు చాలెంజ్ విసరడమే కాదు.. స్వయంగా రోజా వెళ్లి అర్జున్ తో మొక్కలు నాటించడం విశేషంగా చెప్పవచ్చు. పర్యావరణ పరిరక్షణకి ఎంపీ సంతోష్ చేపడుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్పూర్తిగా తీసుకొని రోజా ఇలా మొక్కలు నాటడమే కాదు.. పలువురితో మొక్కలు నాటించడానికి చొరవ చూపడం విశేషం.

ఈ సందర్భంగా సీనియర్ హీరో అర్జున్ మాట్లాడుతూ భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకుని భావితరాలకు మంచి ఆక్సిజన్ అందించాలనే ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్ సంకల్పం గొప్పదన్నారు. దానికి రోజా మొక్కలు నాటించే కార్యక్రమం చేపట్టడం చాలా అభినందనీయమన్నారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా అర్జున్ ముగ్గురికి మొక్కలు నాటాలని చాలెంజ్ విసిరారు. నటుడు జగపతిబాబు , ప్రముఖ దర్శకుడు ఆర్కే సెల్వమని , ఉత్తమ నటి కుష్బూ లు పాల్గొనాలని అర్జున్ ఛాలెంజ్ విసిరారు.

కాగా తన సంకల్పంలో భాగంగా ఎమ్మెల్యే రోజా గారు మొక్కలు నాటించడం గొప్ప శుభపరిణామం అని ఎంపీ సంతోష్ కుమార్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.