Begin typing your search above and press return to search.

నాన్న లాలూకు కిడ్నీ దానం చేయడం అదృష్టం: కుమార్తె ఎమోషనల్

By:  Tupaki Desk   |   6 Dec 2022 2:30 AM GMT
నాన్న లాలూకు కిడ్నీ దానం చేయడం అదృష్టం: కుమార్తె ఎమోషనల్
X
తన తండ్రిని బతికించుకునేందుకు కిడ్నీ దానం చేస్తున్న ఆయన కుమార్తె తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీ మార్పిడికి ముందు తన తండ్రికి తన కిడ్నీని దానం చేయనున్న అతని రెండవ కుమార్తె, హాస్పిటల్ తండ్రితో ఉన్న తన చిత్రాన్ని ట్వీట్ చేసింది. తండ్రి లాలూ కాదంటున్నా ఆయన్ను బతికించుకునేందుకు ఆయన కుమార్తె ఈ సాహసానికి ముందుకు రావడం విశేషం.

లాలూకు తన కిడ్నీ ఇచ్చేందుకు ఆయన కుమార్తె రోహిణి ఆచార్య ముందుకొచ్చింది. ఈ మేరకు వీరిద్దరికీ ముందస్తు శస్త్రచికిత్స పరీక్షల కోసం ఆదివారం ఆసుపత్రిలో చేరారు. దీని తరువాత కిడ్నీ మార్పిడి ఆపరేషన్ నేడు సోమవారం జరుగుతుంది.

బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, పెద్ద కూతురు మిసా భారతి కూడా సింగపూర్‌లో ఆర్జేడీ అధినేతతో కలిసి ఉన్నారు.

కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స సందర్భంగా తన తండ్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో కలిసి శనివారం రాత్రి బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సింగపూర్ వెళ్లారు. లాలూ సన్నిహితుడు భోలా యాదవ్‌, తేజస్వి రాజకీయ సలహాదారు సంజయ్‌ యాదవ్‌ కూడా ఆయన వెంట బయలుదేరారు.

కాగా లాలూ యాదవ్‌ ఆరోగ్యం మెరుగుపడాలని బీహార్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు దానాపూర్‌లోని అర్చన ఆలయంలో పూజలు నిర్వహించారు. స్థానికులు కూడా హవాన్ నిర్వహించి ఆర్జేడీ చీఫ్‌కు శస్త్రచికిత్స విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.