Begin typing your search above and press return to search.
అమెరికాలో రోడ్డు ప్రమాదం: తెలంగాణ యువకుడు మృతి
By: Tupaki Desk | 23 Nov 2021 11:30 PM GMTతెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఓ యువకుడు అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతని మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి సహాయం చేయాలని అతని కుటుంబం భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
కుటుంబ సభ్యులకు ఆలస్యంగా అందిన సమాచారం ప్రకారం, నవంబర్ 19న మేరీల్యాండ్ రాష్ట్రంలోని ఎల్లికాట్ సిటీ వద్ద వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో మండలి శేఖర్ (28) అక్కడికక్కడే మరణించాడు.
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం తేరాటిగూడెం గ్రామానికి చెందిన యువకుడు మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లి ఓ రెస్టారెంట్లో ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. కార్యాలయం నుంచి బయటకు వచ్చి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. అతడిని హోవార్డ్ కౌంటీ జనరల్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చికిత్స పొందుతూ మృతి చెందాడు.
శేఖర్ మరణవార్త తెలుసుకున్న రైతు తండ్రి ఎం.ముత్యాలు, తల్లి కొమరమ్మ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. శేఖర్కు ఒక సోదరుడు, నలుగురు సోదరీమణులు ఉన్నారు. శేఖర్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు సహకరించాలని కుటుంబీకులు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నాయకులు, శేఖర్ స్నేహితులు మృతదేహాన్ని భారత్కు పంపించేందుకు సహాయం చేయాలని కోరుతూ భారత రాయబార కార్యాలయ అధికారులను ఆశ్రయించారు. మృతుడి స్నేహితులు కూడా అతని కుటుంబాన్ని ఆదుకునేందుకు నిధులు సేకరిస్తున్నారు.
శేఖర్ బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండలోని ఓ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చేసి విజయవాడలోని ఓ కాలేజీలో హోటల్ మేనేజ్మెంట్లో కోర్సు చేశాడు. 2017లో ఇటలీలోని యూనివర్సిటీ నుంచి హాస్పిటాలిటీ అండ్ టూరిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, 2018లో అమెరికా వెళ్లి ఓ హోటల్లో ఈవెంట్ మేనేజర్గా చేరాడు. తాజాగా అక్కడ రోడ్డు దాటుతూ కారు ఢీకొనడంతో మృత్యువాత పడ్డాడు.
కుటుంబ సభ్యులకు ఆలస్యంగా అందిన సమాచారం ప్రకారం, నవంబర్ 19న మేరీల్యాండ్ రాష్ట్రంలోని ఎల్లికాట్ సిటీ వద్ద వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో మండలి శేఖర్ (28) అక్కడికక్కడే మరణించాడు.
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం తేరాటిగూడెం గ్రామానికి చెందిన యువకుడు మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లి ఓ రెస్టారెంట్లో ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. కార్యాలయం నుంచి బయటకు వచ్చి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. అతడిని హోవార్డ్ కౌంటీ జనరల్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చికిత్స పొందుతూ మృతి చెందాడు.
శేఖర్ మరణవార్త తెలుసుకున్న రైతు తండ్రి ఎం.ముత్యాలు, తల్లి కొమరమ్మ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. శేఖర్కు ఒక సోదరుడు, నలుగురు సోదరీమణులు ఉన్నారు. శేఖర్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు సహకరించాలని కుటుంబీకులు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నాయకులు, శేఖర్ స్నేహితులు మృతదేహాన్ని భారత్కు పంపించేందుకు సహాయం చేయాలని కోరుతూ భారత రాయబార కార్యాలయ అధికారులను ఆశ్రయించారు. మృతుడి స్నేహితులు కూడా అతని కుటుంబాన్ని ఆదుకునేందుకు నిధులు సేకరిస్తున్నారు.
శేఖర్ బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండలోని ఓ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చేసి విజయవాడలోని ఓ కాలేజీలో హోటల్ మేనేజ్మెంట్లో కోర్సు చేశాడు. 2017లో ఇటలీలోని యూనివర్సిటీ నుంచి హాస్పిటాలిటీ అండ్ టూరిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, 2018లో అమెరికా వెళ్లి ఓ హోటల్లో ఈవెంట్ మేనేజర్గా చేరాడు. తాజాగా అక్కడ రోడ్డు దాటుతూ కారు ఢీకొనడంతో మృత్యువాత పడ్డాడు.