Begin typing your search above and press return to search.

బంధువులే మహిళ స్నానం చేస్తుంటే వీడియో తీసి .. ఆ తర్వాత నీచం !

By:  Tupaki Desk   |   4 May 2021 11:30 PM GMT
బంధువులే మహిళ స్నానం చేస్తుంటే వీడియో తీసి .. ఆ తర్వాత నీచం !
X
గుంటూరు జిల్లాలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. వీడియో పేరుతో బంధువులు వేధించడంతో మహిళ ఆత్మహత్య చేసుకుంది. పొన్నూరుకు చెందిన మహిళ ఈ నెల ఒకటిన ఇంట్లో నిద్రమాత్రలు మింగింది. కొద్దిసేపటికి పనికి వెళ్లిన భర్త శ్రీనివాసరావు ఇంటికి వచ్చాడు.. భార్య ఎంతసేపటికీ ఇంటి తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి తలుపులు పగలగొట్టి చూశారు.. లోపల ఆమె అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే ఆమెను బయటికి తీసుకొచ్చి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

వైద్యులు చికిత్స చేయడంతో ఆమె స్పృహలోకి వచ్చింది. తాను ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించడానికి కారణాలను ఫోన్‌ లో వీడియో తీసి ఉంచానని, చూడాలని చెప్పింది. ఆమె ఆదివారం చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయింది. ఆమె ఫోన్ లో వీడియో చూడగా తాను స్నానం చేస్తుండగా బంధువులు కొందరు నగ్నంగా వీడియో తీసి బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని చెప్పింది. వారికి రూ.లక్షల్లో డబ్బు ఇచ్చానని, ఇంకా కావాలని బెదిరిస్తున్నారని, అడిగినంత డబ్బు తమకు ఇవ్వకుంటే వీడియోలు బయటపెడతామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తన భార్య మృతికి కారణమైన బంధువులపై చర్యలు తీసుకోవాలని భర్త డిమాండ్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.