Begin typing your search above and press return to search.

కరోనా ముప్పును ఉప్పుతో చెక్ పెట్టొచ్చా? నిజమెంత?

By:  Tupaki Desk   |   28 March 2020 8:30 PM GMT
కరోనా ముప్పును ఉప్పుతో చెక్ పెట్టొచ్చా? నిజమెంత?
X
ఆరోగ్యాన్ని దెబ్బ తీయటంలో ఉప్పు పాత్ర చాలానే ఉంటుంది. అందుకే.. కాస్త వయసు పెరుగుతున్నంతనే.. ఉప్పు వాడకాన్ని తగ్గించండన్న మాటను తరచూ వింటుంటాం. ఇప్పుడందరి ఆలోచనలు కరోనా చుట్టూనే తిరుగుతున్నపరిస్థితి. ఇలాంటివేళ.. ఎన్నో ప్రచారాలు జరుగుతున్నాయి. అలాంటివాటిల్లో ఒకటి.. ఉప్పుతో కరోనా ముప్పును తప్పించుకోవచ్చా? అన్నది.

అయితే.. సూటిగా ఒక్క మాటలో తేల్చి చెప్పాలంటే అవునని చెప్పలేం..కాదని చెప్పలేం. అలా అని.. ఈ వాదన తప్పు సుమా అని పూర్తిగా కొట్టి పారేయలేం కూడా. ఉప్పు అధికంగా వాడితే రక్తపోటుకు అవకాశం ఉంటుందని తెలిసిందే. మోతాదుకు మించిన ఉప్పుతో శరీరంలోని రోగనిరోధక శక్తిని తగ్గించే గుణం ఉప్పులో ఉంది.

అందుకే.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ను శరీరం తట్టుకోవాలంటే రోగనిరోధక శక్తి ఎంత ఎక్కువగా ఉంటే.. ముప్పు అంత తక్కువగా ఉంటుందని చెప్పాలి. మరి.. రోగనిరోధక శక్తిని దెబ్బ తీసే గుణం ఉన్న ఉప్పు వినియోగాన్ని తగ్గిస్తే.. కరోనా ముప్పు తగ్గే సూచనలు ఉన్నాయని చెప్పక తప్పదు.

రోజుకు సగటున పురుషులు పది గ్రాములు.. మహిళలు ఎనిమిది గ్రాముల ఉప్పు వాడితే సరిపోతుందంటున్నారు. సరాసరిన ఐదు గ్రాములు సరిపోతుందన్నది వారి వాదన. ఉప్పులో ఉండే సోడియం క్లోరైడ్ తో రక్తపోటు పెరగటమే కాదు.. గుండె జబ్బుల అవకాశం ఇస్తుంది. ఇన్ని దుర్గుణాలు ఉన్న ఉప్పు వాడకాన్ని వెంటనే తగ్గిస్తే.. రోగ నిరోధక శక్తి పెరిగే అవకాశం ఉంటుంది. అది పెరిగే కొద్దీ.. కరోనా ముప్పు అంతో ఇంతో తగ్గుతుందని చెప్పక తప్పదు. సో.. ఉప్పును రోజుకు 5 గ్రాములు.. అంతకంటే తక్కువ వాడితే మీకు మేలు కలిగే వీలుంది.