Begin typing your search above and press return to search.

నా భర్తది ముమ్మాటికీ హత్యే: రాజు భార్య సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   16 Sep 2021 11:30 AM GMT
నా భర్తది ముమ్మాటికీ హత్యే: రాజు భార్య సంచలన వ్యాఖ్యలు
X
సైదాబాద్ లో ఆరేళ్ల బాలిక హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వారం రోజులుగా తప్పించుకొని తిరుగుతున్న రాజు గురువారం ఉదయం స్టేషన్ ఘన్ పూర్ సమీపంలో కోణార్క్ ఎక్స్ ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఈ విషయాన్ని నిర్ధారించి రాజు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు. దీంతో ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాజు భార్య మౌనిక.. తన భర్తను పోలీసులు తీసుకెళ్లి హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. తన భర్త మంచోడని.. ఇలాంటి ఘెరాలు చేసే వ్యక్తి కాదని తెలిపింది. ఒకవేళ నిజంగా తన భర్త తప్పు చేస్తే చట్టపరంగా నిరూపించి శిక్షించాలని.. ఇలా చంపేసి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పడం సరికాదని ఆవేదన వ్యక్తం చేసింది.

తన భర్త ఇన్ని రోజులు పోలీసుల అదుపులోనే ఉన్నాడని.. అతడిని చిత్రహింసలకు గురిచేసి చంపేశారని మౌనిక కన్నీరుమున్నీరవుతోంది. రాజు తల్లి సైతం పోలీసులపై ఆరోపణలు గుప్పిస్తోంది. పోలీసులు అమాయకుడైన తన కొడుకుపై అత్యాచారం కేసు పెట్టి పొట్టన పెట్టుకున్నారని ఆరోపిస్తోంది. తన కుమారుడి శవాన్ని తమకు అప్పగించాలని ఆమె కోరుతోంది. రాజు బంధువులు సైతం ఈ నేరాన్ని అతడిపై అన్యాయంగా మోపి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సైదాబాద్ లో బాలికను రేప్ చేసి చంపిన నిందితుడు రాజు కోసం తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు జల్లెడ పడుతున్న వేళ ఊహించని సంఘటన చోటుచేసుకుంది. కీచకుడు రాజు ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.
ఆరేళ్ల చిన్నారి చైత్రపై అత్యాచారానికి పాల్పడి అత్యంత దారుణంగా హత్య చేసి తప్పించుకొని తిరుగుతున్న రాజు చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఘట్కేసర్ నుంచి వరంగల్ వెళ్లే రైల్వే ట్రాక్ పై అతడి డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. దీంతో రాజు ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది.