Begin typing your search above and press return to search.

లాలూ ఇంట ఆమె లక్కీ చామ్..మురిసిపోతున్నారట

By:  Tupaki Desk   |   12 Aug 2022 2:30 PM GMT
లాలూ ఇంట ఆమె లక్కీ చామ్..మురిసిపోతున్నారట
X
ఇంట్లోకి కొందరు ఎంట్రీతో బాగా కలిసి వచ్చిందని.. అప్పటివరకు ఉన్న కష్టాలు తీరిపోయి.. సుడి తిరిగిపోయినట్లుగా జరుగుతుందంటూ చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు అలాంటి అదృష్టవంతురాలిగా మారింది లాలూ కోడలు. దీర్ఘ కాలం తర్వాత అనూహ్యంగా అధికారం చేతికి వచ్చిన లాలూ కుటుంబానికి కారణం.. లక్కీ చామ్ అయిన కోడలి పుణ్యమేనని లాలూ ఫ్యామిలీ తెగ సంతోషపడుతోంది.

అకస్మాత్తుగా బీజేపీకి హ్యాండిచ్చి.. కొత్త మిత్రులతో చేతులు కలిపిన నితీశ్.. ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన 24 గంటలు తిరగకుండానే మళ్లీ సీఎం కుర్చీలో కూర్చోవటం తెలిసిందే. ఈ మొత్తం ఎపిసోడ్ లో నితీశ్ కుర్చీలో మార్పు లేకపోయినా.. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టటం తెలిసిందే.

అయితే.. దీనంతటికి కారణం.. ఆయన సతీమణి కమ్ చిరకాల స్నేహితురాలు రాజశ్రీ అకా రాచెల్ కారణమని లాలూ కుటుంబం భావిస్తోంది.

ఆమెను 2021 డిసెంబరు 10న వివాహమాడారు. ఈ పెళ్లి జరిగిన తొమ్మిది నెలలకే తేజస్వీ యాదవ్ మరోసారి ఉప ముఖ్యమంత్రి కావటం.. అనారోగ్యానికి గురైన లాలూ ప్రసాద్ యాదవ్ స్వస్థత చేకూరటం.. రాని బెయిల్ వచ్చేయటం లాంటివన్నీ చోటు చేసుకున్నాయని చెబుతున్నారు.

ఇన్ని విశేషాలు.. రాజశ్రీ ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాతే జరిగినట్లుగా లాలూ ఫ్యామిలీతో పాటు ఆర్జేడీ కార్యకర్తలు భావిస్తున్నారు. మొత్తంగా లాలు కుటుంబానికి రాజశ్రీ లక్కీగా మారిందన్న ప్రచారం ప్రస్తుతం బిహార్ లో జరుగుతోంది.

2005లో పవర్ నుంచి దూరంగా ఉన్న ఆర్జేడీకి 2015 నుంచి పద్దెనిమిది నెలలు మాత్రం అధికారంలో ఉంది. అప్పట్లో తేజస్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తే.. అతని సోదరుడు మంత్రిగా వ్యవహరించారు.ఆ తర్వాత నుంచి వారు అధికారానికి దూరమయ్యారు. తాజాగా మళ్లీ అధికారం చేతికి రావటం.. అదంతా రాజశ్రీ పుణ్యమే అన్న మాట ఇప్పుడు బిహార్ లోని పలువురి నోట వినిపిస్తోంది.