Begin typing your search above and press return to search.

మోడీనే ఆడుకుంటున్న రాహుల్.. కాంగ్రెస్ లో జోష్

By:  Tupaki Desk   |   4 Aug 2020 6:50 AM GMT
మోడీనే ఆడుకుంటున్న రాహుల్.. కాంగ్రెస్ లో జోష్
X
పప్పు అంటూ విమర్శించే బీజేపీ నేతలను ఇప్పుడు రాహుల్ చెడుగుడు ఆడేస్తున్నారు. స్తబ్దుగా ఉండే రాహుల్ గాంధీలో ఫైర్ బ్రాండ్ జొచ్చాడని ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులు సంబరపడిపోతున్నాయట. గత సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ సారథ్యంలోనే దేశంలో కాంగ్రెస్ ఓడిపోయింది. అప్పుడు పగ్గాలు వదిలేసిన రాహుల్ లో బాగా పరిణతి వచ్చేసిందంటున్నారు.

ఎన్నికల సమయంలోనూ ‘రఫేల్’ యుద్ధవిమానాల్లో బీజేపీ అవినీతిపై రాహుల్ సంధించిన ప్రశ్నలకు మోడీ, బీజేపీ వద్ద జవాబే లేకుండాపోయింది. చివరకు సుప్రీం కోర్టులో కూడా దేశ రక్షణకు సంబంధించిన ఈ డీల్ ను బయటపెట్టమని తప్పించుకుంది. ఈ రఫేల్ ఉదంతంలో రాహులే గెలిచాడు.

తాజాగా చైనాతో ఘర్షణలోనూ మోడీ అబద్ధాలు చెబుతున్నాడని.. చైనా సంస్థల నుంచి బీజేపీకి నిధులు వచ్చాయని రాహుల్ గాంధీ చేసిన విమర్శలు తూటాల్లా పేలాయి.

తాజాగా రాహుల్ గాంధీ మరో బాంబుపేల్చారు. గడిచిన 24 గంటల్లో ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు భారత్ లో నమోదయ్యాయి. అన్నిదేశాల కంటే భారత్ తొలి స్థానంలో నిలవడంపై రాహుల్ గాంధీ సూటిగా మోడీని ప్రశ్నించారు. ‘సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామంటే ఏంటో అనుకున్నానని.. ఇండియాను మిగిలిన దేశాల కన్నా బెటర్ చేయడం అంటే ఇదేనా?’ అంటూ రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా మోడీని ఎద్దేవా చేశారు.

ఇలా మాటల తూటాలతో మోడీ నోటివెంట సమాధానమే రాకుండా రాహుల్ సంధిస్తున్న ప్రశ్నలు చూసి కాంగ్రెస్ లో జోష్ కనిపిస్తోంది. మోడీని రాహుల్ సోషల్ మీడియా వేదికగా ఆడుకుంటున్నాడని కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.