Begin typing your search above and press return to search.
'మన్యం వీరుడు' విగ్రహావిష్కరణ..మెగాస్టార్ కి కేంద్రం ఆహ్వానం!
By: Tupaki Desk | 28 Jun 2022 2:30 PM GMTతెల్లదొరల కబందహస్తాల నుంచి భరతమాతకు విముక్తి లభించి గతేడాదితో 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం `ఆజాదీ కా అమృత్ మహోత్సవ్` వేడకలను ఘనంగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. `ఆజాదీ కా అమృత్ మహోత్సవ్`'లో భాగంగా గొప్ప విప్లవకారుడు..స్వాతంత్ర్య సమరయోధుడు 'మన్యం వీరుడు' అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర-రాష్ర్ట ప్రభుత్వాలు సంకల్పించాయి.
దీనిలో భాగంగా జులై-4న ఆంధ్రప్రదేశ్ లోని భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. ఈ నేపథ్యంలో కార్యక్రమంలో పాలు పంచుకునేందుకు ప్రభుత్వం తరుపున మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందింది. కేంద్ర ప్రభుత్వం తరుపున ఆహ్వానిస్తూ ఓ లేఖని చిరంజీవికి పంపించినట్లు తెలుస్తోంది.
మరి ఈ లేఖ తెలుగు చనల చిత్ర పరిశ్రమ తరుపున చిరంజీవికి ఒక్కరికే అందిందా? లేక ఇంకా ఎవరైనా అగ్ర స్థాయి హీరోలకు అందిందా? అన్నది తెలియాలి. ఏపీ ప్రభుత్వం..ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో చిరంజీవికి ఉన్న సాన్నిహిత్యం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆ మధ్య ఇండస్ర్టీ సమస్యలపై చిరంజీవి పెద్దగా వ్యవహరించి తలెత్తిన సమస్యని పరిష్కరించడంలో ఎంతో చొరవ చూపారు.
ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా కలిసి సమస్యలపై మాడ్లాడటం ..ఇండస్ర్టీ తరుపున లీడ్ తీసుకోవడం జరిగింది. చిరంజీవి విన్నపాన్ని మన్నించి ప్రభుత్వం పాజిటివ్ గానూ స్పందించింది. ఇక జులై 4న జరిగే అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తప్పక హాజరయ్యే అవుతారు.
ఆయనతో పాటు చిరంజీవి కూడా వెళ్లే అవకాశం ఉందని ఇండస్ర్టీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం చిరంజీవి షెడ్యూల్ అయితే బిజీగానే ఉంది. బాబి దర్శకత్వంలో `వాల్లేరు వీరయ్య` షూటింగ్ తో పాటు... మెహర్ రమేష్ దర్శకత్వంలో `భోళా శంకర్` సినిమాని సెట్స్ కి తీసుకెళ్లారు. ఇటీవలే చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ `ఆర్ ఆర్ ఆర్` చిత్రంలో అల్లూరి సీతారామరాజు గెటప్ లో కనిపించిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ.. దివంగత సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అల్లూరి ఆహార్యంలో కనిపించింది చరణ్ కావడం విశేషం.
దీనిలో భాగంగా జులై-4న ఆంధ్రప్రదేశ్ లోని భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. ఈ నేపథ్యంలో కార్యక్రమంలో పాలు పంచుకునేందుకు ప్రభుత్వం తరుపున మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందింది. కేంద్ర ప్రభుత్వం తరుపున ఆహ్వానిస్తూ ఓ లేఖని చిరంజీవికి పంపించినట్లు తెలుస్తోంది.
మరి ఈ లేఖ తెలుగు చనల చిత్ర పరిశ్రమ తరుపున చిరంజీవికి ఒక్కరికే అందిందా? లేక ఇంకా ఎవరైనా అగ్ర స్థాయి హీరోలకు అందిందా? అన్నది తెలియాలి. ఏపీ ప్రభుత్వం..ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో చిరంజీవికి ఉన్న సాన్నిహిత్యం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆ మధ్య ఇండస్ర్టీ సమస్యలపై చిరంజీవి పెద్దగా వ్యవహరించి తలెత్తిన సమస్యని పరిష్కరించడంలో ఎంతో చొరవ చూపారు.
ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా కలిసి సమస్యలపై మాడ్లాడటం ..ఇండస్ర్టీ తరుపున లీడ్ తీసుకోవడం జరిగింది. చిరంజీవి విన్నపాన్ని మన్నించి ప్రభుత్వం పాజిటివ్ గానూ స్పందించింది. ఇక జులై 4న జరిగే అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తప్పక హాజరయ్యే అవుతారు.
ఆయనతో పాటు చిరంజీవి కూడా వెళ్లే అవకాశం ఉందని ఇండస్ర్టీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం చిరంజీవి షెడ్యూల్ అయితే బిజీగానే ఉంది. బాబి దర్శకత్వంలో `వాల్లేరు వీరయ్య` షూటింగ్ తో పాటు... మెహర్ రమేష్ దర్శకత్వంలో `భోళా శంకర్` సినిమాని సెట్స్ కి తీసుకెళ్లారు. ఇటీవలే చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ `ఆర్ ఆర్ ఆర్` చిత్రంలో అల్లూరి సీతారామరాజు గెటప్ లో కనిపించిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ.. దివంగత సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అల్లూరి ఆహార్యంలో కనిపించింది చరణ్ కావడం విశేషం.