Begin typing your search above and press return to search.

హైవే పై కుప్పలుగా కండోమ్‌లు..అండర్‌గ్రౌండ్‌ లో అమ్మాయిలతో వ్యభిచారం

By:  Tupaki Desk   |   22 Sep 2021 5:32 AM GMT
హైవే పై కుప్పలుగా కండోమ్‌లు..అండర్‌గ్రౌండ్‌ లో అమ్మాయిలతో వ్యభిచారం
X
సాధారణంగా నేషనల్ హైవే పై జనాలు గుమి కూడితే అక్కడ ఏదో పెద్ద యాక్సిడెంట్ అయి ఉంటుందని అందరం వెళ్లి చూస్తుంటాం.. కానీ అక్కడ సీన్ చూసి జనాలు ముక్కున వేలు వేసుకొని వింతగా ఆ దృశ్యాన్ని చూస్తుండిపోయారు. ఎందుకంటే ప్రతిరోజూ వేలాది వాహనాలు, ప్రజలు తిరిగే జాతీయ రహదారిపై వందల సంఖ్యలో కండోమ్ లు కుప్పలు తెప్పలుగా పడి ఉండటం అందరినీ ఆశ్చర్య పరిచింది. గత కొద్ది రోజుల క్రితం కర్ణాటక తుముకూర్ శివారులోని జాతీయ రహదారి 48పై కుప్పలు కుప్పలుగా కండోమ్ లు దర్శనమిచ్చాయి.

ఇది చూసి అటుగా వెళ్లే వాహనదారులు ఆశ్చర్యపోయారు. శ్రీరాజ్ థియేటర్ కు ఎదురుగా ఉన్న ఓ ఫ్లైఓవర్ పై కండోమ్ లు కుప్పలుగా కనిపించాయి. కుప్పలు తెప్పలుగా పడి ఉన్న కండోమ్స్‌ లలో కొన్ని వినియోగించిన కండోమ్ లు ఉండగా, మరికొన్ని ప్యాకెట్లలో ఉన్నాయి. దాంతో స్థానికులు ఈ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ ‌గా మారాయి.

దీంతో కర్ణాటక పోలీసులు రంగంలోకి దిగారు. పెద్ద ఎత్తున కండోమ్‌లు బయటపడంతో విమర్శలు చెలరేగాయి. దీంతో పదిహేను రోజుల విచారణ తర్వాత కండోమ్‌ లు ఎక్కడ నుండి వచ్చాయనే దానిపై పోలీసులు క్లారీటి ఇచ్చారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా కండోమ్‌లు పడిన ప్రాంతంలోని ఓ లాడ్జ్‌లో పోలీసులు సోదాలు నిర్వహించారు.< ఆ లాడ్జిలో ఓ సొరంగాన్ని గుర్తించారు. ఆ సొరంగం ద్వారా వ్యభిచార కూపాన్ని నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు.

జాతీయ రహదారిపై కుప్పలుతెప్పలుగా పడి ఉన్న కండోమ్‌లు ఆ లాడ్జినుండే వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. దీంతో సొరంగంలో ఉన్న వారిని రెడ్ హ్యండెడ్‌ గా పట్టుకున్నారు. సొరంగం ద్వార ఎవరి కంటకనపడకుండా సెక్స్ రాకెట్‌ ను నడుపుతున్నట్టు తేల్చారు. పోలీసుల దాడిలో ముగ్గురు మహిళలతో పాటు ఒక పురుషున్ని అరెస్ట్ చేశారు. కాగా పోలీసులు వెళ్లిన చోట సొరంగం నుండి మహిళలు బయటకు రావడంతో పోలీసులు ఒక్కసారిగా అవక్కాయ్యారు. ఇక లాడ్జ్‌ లో సెక్స్ రాకెట్ బయటపడడంతో ఆ లాడ్జిని మూసివేశారు. దీంతో తమకూరు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి, సుమారు పదిహేను రోజుల అనంతంరం కేసును చేధించారు.ఇందుకోసం స్థానిక ఓ స్వచ్ఛంద సంస్థ సహకారాన్ని కూడా పోలీసులు తీసుకున్నట్టు తెలుస్తోంది. వారి సహాకారంతోనే లాడ్జీలో సోదాలు నిర్వహించినట్టు సమాచారం.