Begin typing your search above and press return to search.
బస్సులో పారిపోతున్న దొంగలను విమానంలో ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు!
By: Tupaki Desk | 24 Feb 2021 1:30 AM GMTక్రిమినల్స్ ను పట్టుకోవడంలో హైదరాబాద్ పోలీసులు మరోసారి తమ సత్తా ఏంటో చూపించారు. ముందుచూపుతో వ్యవహరించి దొంగలకు దిమ్మతిరిగేలా చేశారు. చోరీ చేసి సొంతూరికి బస్సులో వెళ్లిన దొంగలను పట్టుకోవడానికి ఏకంగా విమానంలో వెళ్లారు. దీనితో వారు బస్సు దిగేలోపే వారి చేతికి బేడీలు వేసి కటకటాల వెనక్కి నెట్టారు.
వివరాల్లోకి వెళ్తే .. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్న వాక్స్ బేకరీలో కొన్నిరోజుల క్రితం దొంగతనం జరిగింది. దాదాపు రూ.7 లక్షల నగదు చోరీ చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన బేకరీ యజమాని అమర్ చౌదరి వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించారు. చోరీ జరిగిన విధానం గురించి ఓ అంచనాకు వచ్చిన పోలీసులు అది ఇంటి దొంగల పనే అని ప్రాథమికంగా నిర్ధారించారు.
ఆ దిశగా విచారణ ముమ్మరం చేశారు. వెంటనే నాలుగు స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి.సీసీ కెమెరాలను పరిశీలించగా సోహిదుల్ అస్లాంకు ఎల్ బీ నగర్ కు చెందిన సెక్యూరిటీ గార్డు అలిముద్దిన్ షేక్, అక్సెదుల్ అలీ సహకరించినట్టు తేలింది. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వారు బస్సులో కోల్ కత్తా పారిపోతున్నట్టు పోలీసులు గుర్తించారు. అప్రమత్తమైన పోలీసులు విమానంలో కోల్ కత్తాకు వెళ్లారు. నిందితులు బస్సులో ఉండగానే అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.4.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురినీ రిమాండ్ కు తరలించారు. పోలీసులు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో శంషాబాద్ ఎయిర్ పోర్టులో కోల్కతా వెళ్లే ఫ్లైట్ ఎక్కారు. సాయంత్రం ఐదున్నర గంటలకు కోల్కతా చేరుకున్నారు. 150 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత సరిగ్గా రాత్రి 8గంటల సమయంలో పోలీసులకు తాము వెతుకుతున్న బస్సు తారసపడింది. బస్సును అడ్డగించి ఆపేశారు. ముగ్గురు నిందితులను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బస్సులో పోలీసులను చూసి దొంగలు షాక్ తిన్నారు. వారిని అదే మార్గంలో తిరిగి జూబ్లీహిల్స్ కు తరలించారు పోలీసులు.
వివరాల్లోకి వెళ్తే .. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్న వాక్స్ బేకరీలో కొన్నిరోజుల క్రితం దొంగతనం జరిగింది. దాదాపు రూ.7 లక్షల నగదు చోరీ చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన బేకరీ యజమాని అమర్ చౌదరి వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించారు. చోరీ జరిగిన విధానం గురించి ఓ అంచనాకు వచ్చిన పోలీసులు అది ఇంటి దొంగల పనే అని ప్రాథమికంగా నిర్ధారించారు.
ఆ దిశగా విచారణ ముమ్మరం చేశారు. వెంటనే నాలుగు స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి.సీసీ కెమెరాలను పరిశీలించగా సోహిదుల్ అస్లాంకు ఎల్ బీ నగర్ కు చెందిన సెక్యూరిటీ గార్డు అలిముద్దిన్ షేక్, అక్సెదుల్ అలీ సహకరించినట్టు తేలింది. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వారు బస్సులో కోల్ కత్తా పారిపోతున్నట్టు పోలీసులు గుర్తించారు. అప్రమత్తమైన పోలీసులు విమానంలో కోల్ కత్తాకు వెళ్లారు. నిందితులు బస్సులో ఉండగానే అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.4.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురినీ రిమాండ్ కు తరలించారు. పోలీసులు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో శంషాబాద్ ఎయిర్ పోర్టులో కోల్కతా వెళ్లే ఫ్లైట్ ఎక్కారు. సాయంత్రం ఐదున్నర గంటలకు కోల్కతా చేరుకున్నారు. 150 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత సరిగ్గా రాత్రి 8గంటల సమయంలో పోలీసులకు తాము వెతుకుతున్న బస్సు తారసపడింది. బస్సును అడ్డగించి ఆపేశారు. ముగ్గురు నిందితులను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బస్సులో పోలీసులను చూసి దొంగలు షాక్ తిన్నారు. వారిని అదే మార్గంలో తిరిగి జూబ్లీహిల్స్ కు తరలించారు పోలీసులు.