Begin typing your search above and press return to search.

గులాబీ తోటలో ప్లీనరీ చిచ్చు?

By:  Tupaki Desk   |   27 Oct 2021 8:47 AM GMT
గులాబీ తోటలో ప్లీనరీ చిచ్చు?
X
చూసేందుకు అంతా బాగానే ఉన్నట్లుగా కనిపిస్తున్నా.. గులాబీ తోట లో అంతర్గతం గా రాజుకున్న అధిపత్య మంటలు ఇప్పుడు అంతకంత కూ విస్తరిస్తున్నట్లు గా చెబుతున్నారు. హైటెక్స్ వేదిక గా జరిగిన ప్లీనరీకి మొత్తంగా కేటీఆర్ టీం పని చేసినట్లు గా చెప్పక తప్పదు. ఎందుకంటే.. హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన నేతలే కీలక భూమిక పోషించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పార్టీ లో నెంబర్ వన్ గా కేసీఆర్.. నెంబర్ టూగా కేటీఆర్ ను డిసైడ్ చేసి చాలా కాలమే అయినా.. అదంతా కనిపించి కనిపించనట్లు ఉండేది. తాజాగా మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం నెలకొందన్న మాట వినిపిస్తోంది.

ఇందుకు ప్లీనరీ వేదిక గా మారినట్లు గా చెబుతున్నారు. ప్లీనరీ వేళ వివిధ మీడియా సంస్థల కు ఇచ్చిన జాకెట్ యాడ్లను చూస్తే.. చాలా వరకు కేసీఆర్.. కేటీఆర్ బొమ్మలు మాత్రమే ఉండి.. సదరు యాడ్ ఇచ్చిన పెద్ద మనిషి ఫోటో మాత్రమే ఉండటం కనిపిస్తోంది. ఇంతకాలం పాటు పార్టీకి సంబంధించిన కార్య క్రమాలు ఉన్నప్పుడు సీఎం కేసీఆర్ ఫోటోను ప్రముఖం గా ఉంచేవారు.

ఇక.. కేటీఆర్.. కవిత.. హరీశ్.. సంతోష్.. ఈటల తో సహా మిగిలిన నేతల ఫోటోలు సైజలుల్లో తేడా చూపించేవారు. అందుకు భిన్నంగా ప్లీనరీ సందర్భంగా వేసిన ప్రకటనల్లో ఇద్దరు అధినేతల ఫోటోల్ని ఉంచేసి.. కీలకమైన కవిత.. సంతోష్.. హరీశ్ ఫోటోలు లేకుండా అచ్చేయించిన వైనం చూస్తే.. టీఆర్ఎస్ లో ఎవరి ప్రాధాన్యత ఏమిటన్న విషయం పై స్పష్టత ఇచ్చినట్లు గా చెప్పాలి. హుజూరాబాద్ ఉప ఎన్నిక కారణం గా హరీశ్ ను ప్లీనరీకి దూరంగా ఉంచారన్న గుసగుసలు ఎక్కువ అవుతున్నాయి. కేసీఆర్ కుమార్తె కమ్ ఎమ్మెల్సీ కవిత కూడా ప్లీనరీ కి హాజరు కాకపోవటం గమనార్హం. రాజ్యసభ సభ్యుడు.. టీఆర్ఎస్ లో కీలకంగా చెప్పే సంతోష్ ఫోటోలు సైతం ప్లీనరీ లో ప్రముఖం గా కనిపించకపోవటం ఆసక్తికర చర్చకు తెర తీసింది.

ప్లీనరీ బ్రహ్మండం గా సాగినట్లు గా.. సక్సెస్ అయినట్లు గా ప్రచారం జరుగుతున్నా.. అంతర్గతం గా మాత్రం అందుకు భిన్నమైన సీన్ కనిపిస్తోందని చెబుతున్నారు. పార్టీ కి సంబంధించి ప్రాధాన్యతల జాబితా లో కేటీఆర్ తప్పించి ఇంకెవరూ లేరన్న విషయాన్ని కేసీఆర్ స్పష్టం చేశారని చెబుతున్నారు. నెంబర్ టూ కేటీఆర్ అన్న విషయం పై ఎవరికి ఎలాంటి అనుమానాలు లేకున్నా.. మిగిలిన వారెవరూ కనిపించకుండా ఉండేలా.. కేవలం కేటీఆర్ మాత్రమే ఫోకస్ అయ్యేలా జాగ్రత్తలు వ్యూహాత్మకం గానే సాగినట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. ప్లీనరీ కారణంగా గులాబీ తోట లో మొదలైన అంతర్గత అలజడి..రానున్న రోజుల్లో పార్టీ లో చోటు చేసుకునే అనేక పరిణామాలకు కారణమవుతుందన్నమాట బలం గా వినిపిస్తోంది. ఇందు లో నిజానిజాలు ఎంతన్నది కాలమే డిసైడ్ చేయాలి.