Begin typing your search above and press return to search.

త‌న య‌జ‌మానురాలి కోసం కోర్ట్ లో సాక్షం చెప్పనున్న 'చిలుక' !

By:  Tupaki Desk   |   26 May 2020 1:30 PM GMT
త‌న య‌జ‌మానురాలి కోసం కోర్ట్ లో  సాక్షం చెప్పనున్న చిలుక !
X
ఓ చిలుక .. తన యజమానురాలి కోసం కోర్టులో సాక్ష్యం చెప్పబోతోంది. త‌న య‌జ‌మానురాలి చివ‌రి మాట‌ల‌ను తన నోటి వెంట ప‌లుకుతూ, ఆమె చావుకు కార‌ణ‌మైన వారికి శిక్షను వేయించబోతుంది. ఈ అరుదైన ఘ‌ట‌న అర్జెంటీనాలో చోటు చేసుకుంది. అసలు విషయం ఏమిటంటే ..సాన్ ఫెర్నాడోకు చెందిన‌ ఎలిజ‌బెత్ టోలెడొ అనే మ‌హిళ ఇంటి పైభాగంలో ముగ్గురు వ్య‌క్తులు అద్దెకు దిగారు. వీరిలో ఇద్ద‌రు దుండ‌గులు అద్దెకిచ్చిన మ‌హిళ‌పైనే క‌న్నేశారు. 2018 డిసెండ‌ర్‌లో ఓ రోజు ఆమెను అత్యంత‌ దారుణంగా అత్యాచారం చేసి చంపారు.

ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్న తర్వాత వారికీ ప్లీజ్‌, న‌న్ను వ‌దిలేయండి అంటూ బ్రతిమిలాడుతున్న శ‌బ్ధాలు వినిపించాయి. శ‌బ్ధాల ఆధారంగా ఇంట్లోకి వెళ్లి చూడ‌గా.. న‌గ్నంగా, విగ‌త‌జీవిగా ప‌డి ఉన్న మ‌హిళ శ‌వం ప‌క్క‌న బోనులో ఉన్న‌ చిలుక ప‌లుకులు వినిపించాయి. మ‌హిళ‌ను హింసిస్తూ, అత్యాచారం చేసిన‌ప్పుడు ఆమె వేడుకున్న ఆర్త‌నాదాల‌ను చిలుక గ్ర‌హించి వాటినే ఉచ్ఛ‌రించిన‌ట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఇక‌ ఈ ఘ‌ట‌న క‌న్నా ముందు నిందితులు ఇంట్లోకి చొర‌బడిన వెంట‌నే చిలుక '‌న‌న్ను ఎందుకు కొడుతున్నారు' అంటూ య‌జ‌మాని మాట‌ల‌ను తిరిగి ప‌లికింది. ఈ మాట‌ల‌ను తాము చెవులారా విన్నామంటూ ఇరుగు పొరుగు వారు చెప్పారు. దీనితో ఈ కేసులో చిలుక ప‌లుకుల‌ను సాక్ష్యంగా చేర్చారు. మ‌రోవైపు పోస్టుమార్టంలోనూ బాధితురాలిని కొట్టి, అత్యాచారం చేసి, గొంతు కోసి చంపిన‌ట్లు వెల్ల‌డైంది. దీనితో కేసు న‌మోదు చేసుకున్న‌ పోలీసులు ఇద్ద‌రు నిందితుల‌ను అరెస్ట్ చేశారు. త్వ‌ర‌లోనే కేసు విచార‌ణ‌కు రానుండ‌గా..అక్కడ చిల‌క సాక్ష్యం చెప్పబోతోంది.