Begin typing your search above and press return to search.

ఏపీలో తగ్గని కరోనా.. కొత్తగా 8943 కేసులు

By:  Tupaki Desk   |   14 Aug 2020 4:00 PM GMT
ఏపీలో తగ్గని కరోనా.. కొత్తగా 8943 కేసులు
X
ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఏమాత్రం తగ్గడం లేదు. ఏపీలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. టెస్టుల సంఖ్య పెంచడంతో కేసులు కూడా పెరుగుతున్నాయి.

రోజుకు 10వేల కేసుల వరకు ఏపీలో నమోదు అవుతుండడం కలకలం రేపుతోంది. తాజాగా 9వేల వరకు కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో చూస్తే.. తాజాగా కొత్తగా 8943 కేసులు నమోదయ్యాయి.

ఏపీలో కొత్తగా 24 గంటల్లో 53026 టెస్టులు చేశారు. ఇందులో 8943 పాజిటివ్ గా తేలాయి. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 2,73,085కు చేరాయి.

కరోనా నుంచి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 180703గా ఉంది. గడిచిన ఒక్కరోజులో 9779మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 89907 యాక్టివ్ కేసులున్నాయి.

తాజాగా కరోనాతో గడిచిన 24 గంటల్లో 97మంది మరణించారు. దీంతో ఏపీలో మొత్తం మరణాల సంఖ్య 2475కు చేరింది.

అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1146 కేసులు వచ్చాయి. అనంతపురంలో 762, చిత్తూరులో 987 కేసులున్నాయి.

ఇక కర్నూలు జిల్లాలో 12మంది, చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాలో 10మంది కరోనాతో మృతి చెందారు.