Begin typing your search above and press return to search.

అంధకారంలో పాకిస్తాన్.. నిలిచిన విద్యుత్ సరఫరా

By:  Tupaki Desk   |   23 Jan 2023 8:00 PM GMT
అంధకారంలో పాకిస్తాన్.. నిలిచిన విద్యుత్ సరఫరా
X
భయంకరమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్.. సోమవారం ఉదయం దాని జాతీయ విద్యుత్ గ్రిడ్ విచ్ఛిన్నం కావడంతో దేశవ్యాప్తంగా కరెంట్ కట్ అయ్యి అంధకారం అలుముకుంది. దేశమంతా భారీ విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. కరాచీ, ఇస్లామాబాద్, లాహోర్ మరియు పెషావర్ సహా అన్ని ప్రధాన నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే, ఇది "పెద్ద సంక్షోభం కాదు".. త్వరలో విద్యుత్ తిరిగి వస్తుందని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

పాకిస్తాన్ ఇంధన మంత్రిత్వ శాఖ ఉదయం 8 గంటలకు జాతీయ విద్యుత్ గ్రిడ్‌ విచ్ఛిన్నం అయ్యిందని, అయితే నిర్వహణ పనులు వేగంగా జరుగుతున్నాయని ట్వీట్ చేసింది. కొన్ని గంటల తర్వాత, కొన్ని గ్రిడ్‌లు పునరుద్ధరించబడ్డాయి. రాబోయే 12 గంటల్లో దేశవ్యాప్తంగా విద్యుత్‌ను పూర్తిగా పునరుద్ధరించే అవకాశం ఉందని పాకిస్తాన్ ఇంధన మంత్రి పేర్కొన్నారు. మంత్రి ట్వీట్ చేస్తూ “ఒక గంటలో వార్సాక్ , ఇస్లామాబాద్ నుండి గ్రిడ్ స్టేషన్ల పునరుద్ధరణ ప్రారంభించబడింది. ప్లై కంపెనీ , పెషావర్ సప్లై కంపెనీ యొక్క పరిమిత సంఖ్యలో గ్రిడ్‌లు పునరుద్ధరించబడ్డాయని తెలిపారు.

కానీ భారీ అంతరాయానికి దారితీసింది ఏమిటి? అన్నది పాకిస్తాన్ ప్రభుత్వం బయటపెట్టడం లేదు. సోమవారం సిస్టమ్‌లను ఆన్ చేసినప్పుడు దేశంలోని దక్షిణ భాగంలో జంషోరో , దాదు నగరాల మధ్య ఫ్రీక్వెన్సీ వైవిధ్యం నివేదించబడింది.

చలికాలంలో విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉండటంతో పాకిస్థాన్‌లో రాత్రిపూట విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థలు మూసివేయబడతాయి."వోల్టేజీలో హెచ్చుతగ్గులు ఉన్నాయి. సిస్టమ్‌లు ఒక్కొక్కటిగా మూసివేయబడ్డాయి. ఇది పెద్ద సంక్షోభం కాదు" అని మంత్రి తెలిపారు.

లాహోర్‌లో ఒక లైన్‌లో మెట్రో సేవలు నిలిపివేయబడ్డాయి. ఇస్లామాబాద్‌లో 117 గ్రిడ్ స్టేషన్‌లలో విద్యుత్తు సరఫరా లేదు. పెషావర్‌లో కూడా విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. క్వెట్టా ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ ప్రకారం క్వెట్టాతో సహా బలూచిస్తాన్‌లోని 22 జిల్లాల్లో విద్యుత్ లేదు.

2021లో దక్షిణ పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో ఉన్న పవర్ ప్లాంట్‌లో "సాంకేతిక లోపం" కారణంగా విద్యుత్ ప్రసార వ్యవస్థ ఫ్రీక్వెన్సీ సెకను కంటే తక్కువ వ్యవధిలో 50 నుండి 0కి అకస్మాత్తుగా తగ్గడం వల్ల ఇలాంటి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. చివరికి మొత్తం విద్యుత్ వ్యవస్థను మూసివేసింది. ఒకరోజు తర్వాత విద్యుత్‌ను పునరుద్ధరించారు. ఇప్పుడు అలాంటిదే జరిగింది. ఈసారి కూడా పాకిస్తాన్ నిర్వహణ వైఫల్యంతో ప్రపంచవ్యాప్తంగా పరువు పోగొట్టుకుంది. అభాసుపాలైంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.