Begin typing your search above and press return to search.

ఉద్యోగులకి భారీ షాక్ ఇచ్చిన మోదీ సర్కార్ !

By:  Tupaki Desk   |   16 Jun 2020 10:30 AM GMT
ఉద్యోగులకి భారీ షాక్ ఇచ్చిన మోదీ సర్కార్ !
X

ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఈ ఏడాది ఇంక్రిమెంట్ల అంశంపై కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది వరకూ శాలరీ ఇంక్రిమెంట్ల పెంపు ఉండదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ ఒక ఆర్డర్ కూడా జారీ చేసింది. దీంతో లక్షల మంది ఉద్యోగులపై ప్రభావం పడనుంది. వైరస్ ప్రభావం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.2019 టూ 2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉద్యోగుల వార్షిక పనితీరు అంచనా గడువును పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కాగా ఇదివరకే ప్రభుత్వం ఈ గడువును డిసెంబర్ 2020 వరకూ మాత్రమే పొగిడిగించింది. ఇప్పుడు వచ్చే ఏడాది మార్చి 31ను తాజా డెడ్‌ లైన్‌ గా నిర్ణయించింది. అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇంక్రిమెంట్ కోసం మార్చి 31, 2021 వరకూ ఎదురు చూడాల్సి ఉంటుంది. ఈ పెంపుతో గ్రూప్ ఏ, గ్రూప్ బీ, గ్రూప్ సీ ఉద్యోగులపై ఈ ఎఫెక్ట్ పడనుంది. కేంద్రం జూన్ 11న విడుదల చేసిన ఆర్డర్ ప్రకారం ప్రస్తుతమున్న వైరస్ పరిస్థితుల నేపథ్యంలో మోదీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

అయితే ఇప్పటికే ఇంక్రిమెంట్ల ప్రాసెస్ పూర్తి కావాల్సి ఉండగా మే చివరి వరకూ ఈ ప్రక్రియ పూర్తి కానుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇక దేశంలో వైరస్ తీవ్రంగా విజృంభిస్తుంది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 43 వేల మార్క్ ను దాటింది. నిన్న ఒక్కరోజే 380 మంది కరోనా బాధితులు మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో కరోనాబారినపడి చనిపోయినవారి సంఖ్య 9,900కి చేరింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,667 కేసలుు నమోదు అయ్యాయి.