Begin typing your search above and press return to search.

'బుర్రుందా మీకు'..మార్షల్స్ పై మండిపడ్డ లోకేశ్ !

By:  Tupaki Desk   |   13 Dec 2019 5:27 AM GMT
బుర్రుందా మీకు..మార్షల్స్ పై మండిపడ్డ లోకేశ్ !
X
ఏపీలో జరిగే అసెంబ్లీ శీతాకాల సమావేశాల వేదికగా ఏపీలో మరో కొత్త రాజకీయం మొదలైంది. అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుండి ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటి రోజు నుండే టీడీపీ - వైసీపీ నేతలు నువ్వా నేనా అన్నట్టుగా ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. సభ ప్రారంభం కావడం ఆలస్యం ..ఒకటే తంతు ..విమర్శలు - ఆరోపణలు. ఇదే విధముగా అసెంబ్లీ సమావేశాలు గత ఐదు రోజులుగా కొనసాగుతున్నాయి.

ఇకపోతే - గురువారం ప్రతిపక్ష టీడీపీ ..మీడియాపై ఆంక్షలు పెడుతూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 2430 వ్యతిరేకిస్తూ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఆతరువాత టీడీపీ ఎమ్మెల్యే - టీడీపీ ఎమ్మెల్సీలతో కలిసి చంద్రబాబు నిరసన తెల్పుతూ పాదయాత్రగా అసెంబ్లీకి వచ్చారు. చేతిలో ప్లకార్డులు - నిరసన బ్యాడ్జీలు ఉండటంతో..వాటితో అనుమతి లేదంటూ మార్షల్స్ చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలను అడ్డుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోకి గేటు 2 ద్వారా ప్రవేశించాలి. కానీ , ఆలా రాకుండా ర్యాలీగా రావడంతో మార్షల్స్ అడ్డుకున్నారు.

ఈ సమయంలో టీడీపీ నేతలకు - మార్షల్స్‌కు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. చంద్రబాబుని అసెంబ్లీ లోకి అనుమతించకపోవడంతో…మాజీ మంత్రి లోకేశ్ చీఫ్ మార్షల్‌ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. యూజ్‌ లెస్ ఫెలో - బుర్రుందా మీకు అసలు అంటూ విరుచుకుపడ్డారు. అసెంబ్లీ మెయిన్ గేట్స్‌ ను తొసుకుంటూ తిట్లదండకం అందుకున్నారు. అదే సమయంలో సహనం కోల్పోయిన చంద్రబాబు కూడా మార్షల్స్ పై నోరు జారారు.