Begin typing your search above and press return to search.

మాజీ ప్రధానికి కౌంటర్ ఇచ్చిన పీవీ మనవడు..ఏమైందంటే ?

By:  Tupaki Desk   |   5 Dec 2019 12:06 PM GMT
మాజీ ప్రధానికి కౌంటర్ ఇచ్చిన పీవీ మనవడు..ఏమైందంటే ?
X
నేడు ఐకే గుజ్రాల్ శత జయంతి సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ..పీవీ మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దేశంలో సిక్కు అల్లర్లకు ప్రధాన కారణం అప్పటి హోంమంత్రి పీవీ నే అంటు అన్నారు. భారతదేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీని 1984లో ఆమె సెక్యూరిటీ గార్డులే కాల్చి చంపిన నేపథ్యంలో ఢిల్లీలో భారీగా సిక్కుల ఊచకోత జరిగింది. దీనితో భారీగా అల్లర్లు చెలరేగాయి. ఆ సమయంలో అప్పటి హోంమంత్రి పీవీ నరసింహారావు మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ సలహా మేరకు వ్యవహరించి ఉన్నట్లయితే ఆ అల్లర్లే జరిగి ఉండేవి కావని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు.

ఆ అల్లర్లు జరిగిన రోజు ఐకే గుజ్రాల్ అప్పటి హోంమంత్రి పీవీ నరసింహారావు ఇంటికి వెళ్లారని ఆయన తెలిపారు. పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయని - ఆర్మీని వెంటనే రంగంలోకి దించాలని గుజ్రాల్ అప్పటి హోంమంత్రి పీవీకి సూచించారని మన్మోహన్ గుర్తు చేసుకున్నారు. కానీ , అయన సరైన విదంగా రెస్పాండ్ కాలేదు అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై పీవీ నరసింహా రావు మనుమడు - బీజేపీ నేత ఎన్వీ సుభాశ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘పీవీ కుటుంబ సభ్యునిగా ఆ వ్యాఖ్యలపై తీవ్రంగా దిగులుపడుతున్నా. మాజీ ప్రధాని మన్మోహన్ చేసిన వ్యాఖ్యలు సమర్థించేవి కావు. కేబినెట్ ఆమోదం లేకుండా ఏ హోం మంత్రైనా సొంత నిర్ణయం తీసుకోవచ్చునా? ఆ సమయంలో ఆర్మీని రంగంలోకి దించినట్లైతే పెద్ద విపత్తు జరిగి ఉండేది అని ఎన్వీ సుభాశ్ చెప్పారు.