Begin typing your search above and press return to search.

నీట్ లో ఫలితాల్లో గందరగోళం .. 650 వస్తే 329 వేశారు !

By:  Tupaki Desk   |   20 Oct 2020 4:30 PM GMT
నీట్ లో ఫలితాల్లో గందరగోళం ..  650 వస్తే 329 వేశారు !
X
దేశ వ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌) ఫలితాలపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం పెరిగిపోతుంది. టాపర్ గా నిలిచిన విద్యార్థిని ఫెయిల్ అయినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, మృదుల్ రావత్ అనే విద్యార్థికి తొలుత ఫెయిల్ మార్కులు వచ్చాయి. అయితే, ఆ తర్వాత ఓఎంఆర్ షీటును రీచెకింగ్ చేయిస్తే, ఎస్టీ కేటగిరీలో ఆలిండియా టాపర్ గా రావత్ నిలిచాడు. 17 ఏళ్ల రావత్ రాజస్తాన్ లోని సవాయి మాధోపూర్ జిల్లాలోని గంగాపూర్ పట్టణంలో నివసిస్తున్నాడు. అక్టోబర్ 16 న, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ జారీ చేసిన మొదటి మార్క్‌షీట్‌ ప్రకారం అతడు ఫెయిల్‌ అయినట్లు వచ్చింది.

720 మార్కులకు గాను మృదుల్‌ కు 329 పాయింట్లు ఇచ్చింది. దాంతో అతడు రిజల్ట్‌ని సవాలు చేశాడు. ఈ క్రమంలో అతడి ఓఎంఆర్‌ షీట్‌, ఆన్సర్‌ కీని తిరిగి తనిఖీ చేయడంతో 650 మార్కులతో అతను ఎస్టీ కేటగిరీ లో ఆల్‌ ఇండియా టాపర్‌ అని తేలింది. జనరల్ కేటగిరీలో ఆల్‌ ఇండియా 3577వ ర్యాంకు సాధించాడు. అయితే, ఎన్‌ టీఏ జారీ చేసిన రెండవ మార్క్‌ షీట్‌ లో కూడా మరో పొరపాటును గుర్తించారు. దాని‌లో, అతని మార్కుల మొత్తం 650 అని చూపించినప్పటికి.. అక్షరాల్లో మాత్రం మూడు వందల ఇరవై తొమ్మిది అని రాశారు.

అలాగే, ఫస్ట్‌ ర్యాంకు విషయంలో కూడా విమర్శలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఒడిశాకు చెందిన సోయబ్‌ అఫ్తాబ్‌, ఢిల్లీకి చెందిన ఆకాంక్ష సింగ్‌ ఇద్దరు ఆవుట్‌ ఆఫ్‌ మార్కులు సాధించారు. కానీ ఎన్ ‌టీఏ టై బ్రేకింగ్‌ పాలసీ ప్రకారం అఫ్తాబ్‌కి మొదటి ర్యాంకు, ఆకాంక్షకు రెండవ ర్యాంకుగా ప్రకటించింది.