Begin typing your search above and press return to search.

చాపకింద నీరులా విస్తరిస్తున్న ఎల్ టీటీఈ..: ఎన్ఐఏ నిఘా

By:  Tupaki Desk   |   29 Jan 2022 9:30 AM GMT
చాపకింద నీరులా విస్తరిస్తున్న ఎల్ టీటీఈ..: ఎన్ఐఏ నిఘా
X
టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్ టీటీఈ) మళ్లీ తిరగబడుతోందా..? తమిళనాడు రాష్ట్రాన్ని కేంద్రంగా చేసుకొని వారి బలం పెంచుకుంటున్నారా..? కొత్తగా సభ్యత్వాలు చేర్చుకుంటూ దీనిని విస్తరిస్తున్నారా..? ఇందుకు రాజకీయ నాయకుల అండ కూడా ఉందా..? అనే విషయాలు ఇప్పుడు మరోసారి కలకలం రేపుతున్నాయి. గతేడాది అనధికారికంగా తమిళనాడులో తలదాచుకుంటున్న ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. అమెకు ఎల్ టీటీఈతో సంబంధాలున్నట్లు పోలీసులు ప్రకటించారు. అమెకు సహకరించిన వారిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా ఆమెకు సహకరించిన ముగ్గురు రాజకీయ నేతలపై ఎన్ఐఏ నిఘా ఉంచినట్లు తెలుస్తోంది.

ఎల్ టీటీఈ.. శ్రీలంకకు నిద్రలేకుండా చేసిన ఈ వర్గం 1970లో ఏర్పడింది. ఇందులోని వారు శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ హక్కుల కోసం పోరాటం చేశారు. అలా పోరాటం చేసిన క్రమంలో ఎందరో ప్రాణాలను పోగొట్టుకున్నారు. శ్రీలంకలో సుదీర్ఘకాలం పోరాటాలు చేసిన ఈ వర్గం కాల క్రమంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్యకు గురయ్యారు. అయితే ఆ తరువాత 2009లో అక్కడి ప్రభుత్వం ఎల్ టీటీఈ ఉద్యమ సారధి ప్రభాకరణ్ ను మట్టుబెట్టడంతో ఈ వర్గం కార్యకలాపాలు కనుమరుగయ్యాయి. అప్పటి నుంచి మళ్లీ ఎల్ టీటీఈ జాడలు కనిపించ లేదు.

అయితే తాజాగా జరుగుతున్న పరిణమాల నేపథ్యంలో ఎల్ టీటీఈ మళ్లీ విస్తరిస్తోన్నట్లు కనిపిస్తోంది. కొందరు ఈ వర్గం విస్తరణకు కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఎన్ఐఏ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. గతేడాది తమిళనాడులో నివాసం ఉంటున్న లక్ష్మణన్ మేరీ బిరాన్ సింఘే అనే 50 సంవత్సరాల మహిళను అరెస్టు చేశారు. వాస్తవానికి ఈమె శ్రీలంక దేశస్థురాలు. 2019లో శ్రీలంక పాస్ పోర్టు ద్వారా తమిళనాడుకు వచ్చిన ఆమె వీసా గడువు 2020లో ముగిసిపోయింది. అయినా చెన్నైలోని అన్నానగర్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని నివసిస్తోంది. కాగా గ్యాస్ బిల్లు ఆధారంగా ఆమె ఇండియా పాస్ పోర్టు సాధించింది. బెంగుళూరు మీదుగా ముంబయ్ కి ప్రయాణమవుతున్న నేపథ్యంలో ఆమెను చెన్నై విమానాశ్రయంలో అరెస్టు చేశారు.

అంతేకా కుండా ఆమెకు సహకరించిన వారిపై కూడా ఆరా తీస్తున్నారు. ఇదే సమయంలో లక్షదీవుల సమీ3333పంలో ఎల్ టీటీఈలో అధికారికంగా ఉన్న సద్గుణం అలియాస్ సెబాస్టియన్ ను గతేడాది మార్చిలో అరెస్టు చేశారు. అతడి నుంచి ఏకే 4, తూటాలు, 300 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో పోలీసులు విచారణ చేయడంతో ఎల్ టీటీఈ పునరుద్ధరణ కోసం మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తేలింది. ఇదిలా ఉండగా కెన్నిసన్ పొర్ మాండో, భాస్కరన్, జాన్సన్ సామువేల్, సెల్ముదన్ అనే శ్రీలకంకు చెందిన నలుగురు వ్యక్తులు ముంబయ్ హార్బర్లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఏటీఎం ద్వారా నగదు డ్రా చేసినట్లు తెలిసింది.

చెన్నైలో పట్టుబడిన మహిళతో పాటు ఈ నలుగురు పై ఎన్ఐఏ కేసులు నమోదు చేసింది. దీంతో అప్రమత్తమైన ఆ విభాగం అధికారులు తమిళనాడు డీజీపీ శైలేంద్రబాబుతో సమాలోచనలు జరిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకీ ఎన్ఐఏ అధికారులు మూడు పేజీల నివేదికను కూడా సమర్పించారు. తమిళనాడు ఎల్ టీటీఈ పునరుద్దరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని, అంతేకాకుండా కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించి విచారణ జరిపి 15 రోజుల్లోగా బదులివ్వాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది. అలాగే ముగ్గురు రాజకీయ నాయకులపై కూడా నిఘా ఉంచాలని సూచించింది.