Begin typing your search above and press return to search.

డయాబెటిస్ రోగులకు సబ్సిడీ ఇవ్వాలి: సీజేఐ

By:  Tupaki Desk   |   30 Nov 2021 12:30 AM GMT
డయాబెటిస్ రోగులకు సబ్సిడీ ఇవ్వాలి: సీజేఐ
X
దేశంలో పెరిగిపోతున్న డయాబెటిస్ వ్యాధిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు.నిశ్శబ్ధ మహమ్మారి డయాబెటిస్ వల్ల కలుగుతోన్న నష్టం మాటల్లో చెప్పలేనిదని.. చక్కెర వ్యాధి వల్ల దేశంపై పడుతోన్న ఆర్థిక భారం అంచనాలకు అందనిదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అన్నారు. క్యాన్సర్, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధుల కోసం లక్షలాది రూపాయల ఖర్చు చేస్తున్నా దేశ ప్రజలను గుల్ల చేస్తూ.. పేదల జేబులను ఖాళీ చేస్తోన్న డయాబెటిస్ ను 'నిశ్శబ్ధ మహమ్మారి'గా జస్టిస్ రమణ అభివర్ణించారు.

డయాబెటిస్ (చక్కెర వ్యాధి) వల్ల కలుగుతోన్న నష్టం మాటల్లో చెప్పలేనిదని.. చక్కెర వ్యాధి వల్ల దేశంపై పడుతోన్న ఆర్థిక భారం అంచనాలకు అందనిదని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. డయాబెటిస్ పై అవగాహనకు సంబంధించిన ఓ కార్యక్రమంలో జస్టిస్ రమణ మాట్లాడుతూ ప్రభుత్వాలకు సంచలన సూచనలు చేశారు.

డయాబెటిస్ చికిత్సకు రాయితీలు అందించాని ప్రభుత్వానికి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారికి చికిత్స అందించడం కోసం ప్రభుత్వాలు రాయితీ ఇవ్వాలని సీజేఐ సూచించారు.

మధుమేహానికి చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్నదని.. పేదల పాలిట శత్రువుగా మారిందని జస్టిస్ ఎన్వీ రమణ గుర్తు చేశారు. డయాబెటిస్ ఎంత ప్రమాదకారో కోవిడ్ నిరూపించిందన్నారు. వైరస్ తో డయాబెటిక్ రోగులకు ఎక్కువ ప్రాణహాని ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. కోవిడ్ ఒక వేవ్ లాగా వస్తే డయాబెటిస్ మాత్రం విస్తరిస్తూ ప్రాణాలను కబళిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

డయాబెటిస్ పై భారత్ కేంద్రంగా అధ్యయనాలు రావాల్సి ఉందని.. షుగర్ లెవల్స్ ఎంతుండాలో ఖచ్చితమైన ప్రమానాలను రూపొందించుకోలేకపోతున్నామని సీజేఐ రమణ ఆవేదన వ్యక్తం చేశారు.

డయాబెటిస్ అనేది ఆధునిక జీవన విధానం సృష్టించిన ఉత్పత్తే అని సీజేఐ రమణ అన్నారు. నిశ్చబ్ధ మహమ్మారి డయాబెటిస్ ను శాశ్వతంగా దూరం చేయడానికి భారత్ పరిశోధనలు జరపాల్సి ఉందని.. ఔషధాన్ని వీలైనంత వేగంగా కనుక్కోవాలని.. త్వరలోనే మందు అదుబాటులోకి వస్తుందని ఆకాంక్షిస్తున్నానని సీజేఐ రమణ తెలిపారు.