Begin typing your search above and press return to search.

ఆస్తులు పంచేసిన ముఖేష్ అంబానీ.. మూడు సంస్థలుగా రిలయన్స్ విభజన

By:  Tupaki Desk   |   30 Jun 2022 10:30 AM GMT
ఆస్తులు పంచేసిన ముఖేష్ అంబానీ.. మూడు సంస్థలుగా రిలయన్స్ విభజన
X
తన ఆస్తులపై భారత్ లోనే నంబర్ 1 కుబేరుడు ముఖేష్ అంబానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పిల్లలు చేతికి వచ్చిన వేళ ఆస్తుల పంపకం మొదలుపెట్టారు. జియో ఇన్ఫోకామ్ కు ఆకాష్ ను చైర్మన్ చేయడంతో తన అడుగులు ఎలా ఉండబోతున్నాయో స్పష్టం చేశారు.

తన వ్యాపారాలన్నింటిని మూడు భాగాలుగా చేసిన ముఖేష్ అంబానీ వాటిని తన ముగ్గురు పిల్లలకు సమంగా పంచేశారు. ఈ మూడు సంస్థలను మానిటర్ చేసేలా ట్రస్ట్ ఏర్పాటు చేయబోతున్నారు. ఇంతకీ ముఖేష్ అంబానీ నిర్ణయం వెనుక అసలు వ్యూహం ఏంటన్నది ఆసక్తి రేపుతోంది.

బాహుబలి సినిమాలో సింహాసనం కోసం కొట్టుకు చచ్చిన వారుసుల వైనాన్ని ముందే గ్రహించిన ముఖేష్ అంబానీ ప్రస్తుతం బడా వ్యాపారవేత్తల కుటుంబాల్లోనూ ఇలాంటి ఆస్తుల గొడవలు చూసి తాజాగా రిలయన్స్ ను విభజించారు. రిలయన్స్ విషయంలోనూ ముఖేష్, అనిల్ అంబానీలు పంచుకోవడం ఎంత గొడవకు దారితీసిందో అందరికీ తెలిసిందే. అనిల్ అంబానీ అప్పులతో ఇప్పుడు ఆస్తులన్నీ పొగ్గొట్టుకున్నాడు. ఇప్పటికే ముఖేష్, అనిల్ అంబానీల మధ్య దూరం ఉంది.

ఇలాంటి పరిస్థితులన్నీ ముందే గ్రహించి.. తను యాక్టివ్గా ఉన్నప్పుడే ఈ వ్యాపారాలు పంచాలని ముఖేష్ అంబానీ డిసైడ్ అయిపోయారు. తన వారసుల విషయంలో ముఖేష్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ముఖేష్ అంబానీ చాలా తెలివిగా పక్కా ప్రణాళికతో వ్యవహరించి రిలయన్స్ చీలిపోకుండా ఉండేందుకు అద్భుతమైన ఆలోచనలు చేస్తున్నారు. తన వారసులకు ఆస్తుల పంపకం ప్రక్రియను ముఖేష్ మొదలుపెట్టారు.

టెలికాం అనుబంధమైన రిలయన్స్ జియో చైర్మన్ గా పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీకి బాధ్యతలు అప్పగించారు. ముఖేష్ రాజీనామా చేసి తన కుమారుడిని చైర్మన్ ను చేశాడు.

ఇక మరో కీలకమైన విభాగం 'రిటైల్'ను ముకేష్ కుమార్తె ఇషా చేపట్టనుంది. ఇక ఆర్ఐఎల్ గ్రూప్ లోని చమురు శుద్ధి, పెట్రో కెమికల్స్, టెలికాం, రిటైల్, మీడియా, న్యూ ఎనర్జీ విభాగాల్లో విస్తరించింది. వీటిని చిన్న కుమారుడు అనంత్ కు అప్పగించనున్నారు. ముగ్గురు పిల్లలకు తన వ్యాపార సామ్రాజ్యాన్ని సమయంగా పంచి భవిష్యత్ లోనూ ఎలాంటి వివాదాలు రాకుండా.. రిలయన్స్ గ్రూప్ చీలిపోకుండా ఉండేందుకు పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతున్నాడు. అన్నింట్లోనూ ముకేష్ ముందుచూపు కనిపిస్తోంది.

వాల్ మార్ట్ సంస్థ అధిపతి అయిన శామ్ వాల్టన్ కూడా ఇలానే తన సంస్థను ట్రస్ట్ కు అప్పగించి కుటుంబ సభ్యులను డైరెక్టర్ గా చేసి తనకంచుకోట సంస్థ చీలిపోకుండా చేశాడు. ఇప్పుడు ముకేష్ అంబానీ అదే చేశాడు.