Begin typing your search above and press return to search.

పార్టీకి పిలిచిన మహిళపై అత్యాచారం, ఆపై హత్య !

By:  Tupaki Desk   |   9 July 2020 2:30 PM GMT
పార్టీకి పిలిచిన మహిళపై అత్యాచారం, ఆపై హత్య !
X
మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకొస్తున్న కూడా మహిళపై జరిగే అఘాయిత్యాలని అడ్డుకోలేకపోయారు . కామం తో కళ్లు ముసుకు పోయిన కొందరు మానవ మృగాలు ..మానవత్వం మరచి ఆడవాళ్లు కనిపించగానే కామంతో రగిలిపోయి వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అలా మరో కామాంధుడి కోరికకు మరో మహిళ బలైంది. మద్యం మత్తులో ఆమె పై అఘాయిత్యానికి పాల్పడి , ఆపై హత్య చేసి అక్కడి నుండి పరారైయ్యాడు. ఈ సంఘటన మంగళవారం హైదరాబాద్ ఓల్డ్ సిటీ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాలు చూస్తే ... కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌ పరిదిలోని జియాగూడ కేశవస్వామినగర్‌ ప్రాంతానికి చెందిన అండాలు, జియాగూడ మేకల మండిలో మేకలవ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఆమెకి భర్త రాములు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మద్యే జియాగూడ కేశవస్వామినగర్‌ లో సొంతిల్లు నిర్మిస్తున్నారు . ఇప్పటికే ఆ ఇంటి నిర్మాణం పూర్తికావస్తుడడంతో మేస్త్రీ, కూలీలకు పార్టీని ‌ ఏర్పాటు చేశారు. అయితే, మేస్త్రీకీ తోడు అతని స్నేహితుడు రవి కూడా ఆ పార్టీకి హాజరయ్యాడు.

అర్థరాత్రి దాటిన తరువాత విందు పూర్తి అయ్యాక ఇంటి మొదటి అంతస్తుపైకి పడుకోవడానికి అండాలు వెళ్లింది. ఇది గమనించిన రవి డాబాపైకి వెళ్లి ఆమె పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం గొంతు నులిమి హత్య చేశాడు . పై అంతస్తుకు వెళ్లిన రవి ఎంత సేపటికి కిందకు రాకపోవడంతో రాములు, కుమారుడు వెళ్లి చూసేసరికి ఆమె మృతిచెందిందని పోలీసులు తెలిపారు. రవిని పట్టుకోవడానికి కుటుంబసభ్యలు ప్రయత్నించగా పారిపోయినట్టు తెలిపారు. భర్త రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కుల్సుంపురా పోలీసులు ఆ రవి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.