Begin typing your search above and press return to search.

మాన్సాస్ ట్రస్ట్ కేసు: సంచయితపై అశోక్ దే విజయం

By:  Tupaki Desk   |   14 Jun 2021 11:33 AM GMT
మాన్సాస్ ట్రస్ట్ కేసు: సంచయితపై అశోక్ దే విజయం
X
విజయనగరం జిల్లాలోని మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (మాన్సాస్) చైర్మన్ పదవి నుంచి సంచయితను తొలగిస్తూ ఏపీలో హైకోర్టు సంచలన ఆదేశాలిచ్చింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అశోక్ గజపతి రాజు స్థానంలో సంచయితను ఈ బోర్డు చైర్మన్ గా నియమించింది. దీన్ని సవాల్ చేస్తూ ఏడాదికి పైగా సింహాచాలం దేవస్థానమ్స్ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్, ప్రముఖ తెలుగు దేశం పార్టీ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి పి అశోక్ గజపతి రాజు న్యాయ పోరాటం చేశారు. చివరకు హైకోర్టులో తన వాదనతో గెలిచాడురు. సంచయిత పోస్ట్ ఊస్ట్ చేయించి ఆ స్థానంలో తిరిగి నియామక ఉత్తర్వులు పొందారు.

ఏపీ ప్రభుత్వం 2020 మార్చిలో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు సోమవారం కొట్టివేసింది. అశోక్ గజపతి రాజు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు ప్రకారం ట్రస్ట్ నిబంధనల ప్రకారం సంచయితను మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం ట్రస్ట్ బోర్డు ఛైర్‌పర్సన్‌గా నియమించడం చట్టవిరుద్ధమని అభిప్రాయపడింది.

అశోక్ గజపతి రాజు ట్రస్టులు.. సంబంధిత సంస్థల ఛైర్మన్‌గా కొనసాగుతారని, ఆయనను తిరిగి ట్రస్టుల ఛైర్మన్‌గా నియమించాలని ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది.

అశోక్ గజపతిరాజు ఈ ట్రస్టీలకు గతంలో చైర్మన్ గా ఉండేవారు. ఆయన స్థానంలో అశోక్ పెద్దన్నయ్య ఆనంద గజపతి రాజు కుమార్తె సంచయిత నియామకం అయ్యారు. ట్రస్టుల చైర్‌పర్సన్‌గా నియమితులై అకస్మాత్తుగా వెలుగులోకి వచ్చారు..

అంతకుముందు ఆమె ఎన్జీఓ సంస్థను ఢిల్లీలో నడుపుతున్నది. తరువాత భారతీయ జనతా పార్టీలో చేరింది. అయితే, ట్రస్టుల ఛైర్‌పర్సన్‌గా ఆమె నియామకాన్ని రాష్ట్ర బిజెపి నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు.

మాన్సాస్ ట్రస్ట్ అనేది ఎండోమెంట్స్ విభాగం క్రింద ఒక ఛారిటబుల్ ట్రస్ట్, ఇది ఒక వైద్య కళాశాలతో సహా 12 విద్యా సంస్థలను నిర్వహిస్తుంది. అశోక్ గజపతిరాజ వంశీకులకు చెందింది. అందులో ఎవరు పెద్ద అయితే వారే వాటికి చైర్మన్ గా ఉండాలని నిబంధనలు పొందుపరిచారు. వయసులో చిన్న కావడంతో సంచయిత పదవి కోల్పోయారు. గజపతిరాజుల కుటుంబం ఉత్తరాంధ్రలోని నాలుగు జిల్లాలలో 13,000 ఎకరాలకు పైగా భూములను కలిగి ఉండేది. వాటిల్లో కొన్ని విరాళంగా ఇచ్చింది.