Begin typing your search above and press return to search.

తుపాకులకు దండం పెట్టాలనుంది.. ఆ బుల్లెట్టు దాచుకోవాలని ఉంది

By:  Tupaki Desk   |   6 Dec 2019 6:35 AM GMT
తుపాకులకు దండం పెట్టాలనుంది.. ఆ బుల్లెట్టు దాచుకోవాలని ఉంది
X
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన వెటర్నరీ వైద్యురాలు దిశ పాశవిక హత్యకు కారణమైన నలుగురు నిందితులపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబుకటం తెలిసిందే. నిందితులకు చర్లపల్లి జైల్లో మటన్ బిర్యానీ పెట్టటం లాంటి వాటిపై మండిపడుతున్నారు. అమాయక ఆడపిల్లను దారుణంగా హతమార్చిన నిందితులకు ప్రజాసొమ్ముతో ఎలా తిండి పెడతారని ప్రశ్నించన వారు లేకపోలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా దిశ నిందితుల్ని పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన వైనం సంచలనంగా మారింది.

దిశ ఎన్ కౌంటర్ సమాచారంపై దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై వాట్సాప్ గ్రూపుల్లోనూ.. సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు. ఎన్ కౌంటర్ మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. సామాన్యుల మొదలు సెలబ్రిటీల వరకూ.. రాజకీయ ప్రముఖులు సైతం తాజా ఎన్ కౌంటర్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా టాలీవుడ్ హీరో మంచు మనోజ్ చేసిన కామెంట్ అందరిని ఆకర్షిస్తోంది.

ఆ బుల్లెట్టు దాచుకోవాలని ఉంది.. ఆ తుపాకులకు దండం పెట్టాలని ఉంది.. ఆ పోలీసుల కాళ్లు మొక్కాలని ఉంది.. నలుగురు చచ్చారనే వార్తలో ఇంత కిక్కు ఉందా? ఈ రోజునే నీ ఆత్మ దేవుడ్ని చేరింది చెల్లెమ్మా అంటూ రియాక్ట్ అయ్యారు. ఇలా పెద్ద ఎత్తున ఎన్ కౌంటర్ కు.. పోలీసుల చర్యలకు ప్రజలు పాజిటివ్ గా రియాక్ట్ కావటం గమనార్హం.