Begin typing your search above and press return to search.

ఒక్కరోజులోనే ఆంధ్రా రికార్డ్ బ్రేక్ చేసిన మధ్యప్రదేశ్ .. !

By:  Tupaki Desk   |   22 Jun 2021 11:30 AM GMT
ఒక్కరోజులోనే  ఆంధ్రా రికార్డ్ బ్రేక్ చేసిన మధ్యప్రదేశ్ .. !
X
మనదేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుంది. తాజాగా దేశంలో నమోదు అయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. అలాగే పాజిటివిటీ రేటు కూడా భారీగా పెరిగింది. దీనికి ప్రధాన కారణం దేశంలో భారీ స్థాయిలో వ్యాక్సినేషన్ జరుగుతుండటమే. దేశంలో భారీ స్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఒక్కరోజే ఏకంగా 84 లక్షల మంది ప్రజలకు వ్యాక్సిన్ వేశారు. ఇంత పెద్ద సంఖ్యలో వ్యాక్సినేషన్ తీసుకోవడం ఇదే ప్రథమం. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ట్వీట్ చేసింది.

ఆదివారం దాదాపు 14 లక్షల మందికి వ్యాక్సిన్ వేసి ఆంధ్రప్రదేశ్ సృష్టించిన రికార్డును, ఒక్క రోజులోనే మధ్యప్రదేశ్ రాష్ట్రం బ్రేక్ చేసింది. మధ్యప్రదేశ్‌ లో సోమవారం అత్యధికంగా 16 లక్షల మందికి పైగా కరోనా వైరస్ వ్యాక్సిన్లు వేశారు. ఒక్క ఇండోర్ జిల్లాలోనే 2.2 లక్షల వ్యాక్సిన్ డోసులని పంపిణి చేసినట్టు తెలిపింది. సోమవారంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ 157వ రోజుకు చేరుకుంది. వ్యాక్సినేషన్ విషయంలో రికార్డు సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు రికార్డు బ్రేకింగ్ స్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగడం ఆనందదాయకం. కోవిడ్‌ 19కు వ్యతిరేకంగా ఉన్న ఏకైక ఆయుధం వ్యాక్సిన్. వ్యాక్సిన్ వేయించుకున్న ప్రతి ఒక్కరికీ నా అభినందనలు. పౌరులకు వ్యాక్సిన్ సక్రమంగా అందేలా కృషి చేస్తున్న ఫ్రంట్‌ లైన్ యోధులకు ధన్యవాదాలు. వెల్‌డన్ ఇండియా అంటూ ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు.