Begin typing your search above and press return to search.

సీఎంకి చల్లటి చపాతీలు పెట్టిన అధికారి సస్పెండ్..సీఎం ఏంచేశారంటే?

By:  Tupaki Desk   |   26 Sep 2020 9:30 AM GMT
సీఎంకి చల్లటి చపాతీలు పెట్టిన అధికారి సస్పెండ్..సీఎం ఏంచేశారంటే?
X
ఓ సీఎం పర్యటన అంటే ఆ హడావిడి మరో లెవెల్ లో ఉంటుంది. పర్యటనకి ముందే ఆ ప్రదేశాన్ని అధికారులు తమ చేతుల్లోకి తీసుకోవడం, అక్కడ పటిష్ట ఏర్పాట్లు , తినే ఫుడ్ నుండి పడుకునే బెడ్ వరకు అన్నింట్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఏ మాత్రం తేడా జరిగినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు కాబట్టి ఏ చిన్న విషయాన్ని కూడా వదిలిపెట్టారు. అయితే , సాక్షాత్తు సీఎం పర్యటనకు వస్తే, తన విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఓ అధికారి సస్పెండైన ఘటన మధ్యప్రదేశ్‌ లో జరిగింది.

అయితే , ఆ తరువాత ఆ విషయం ముఖ్యమంత్రి వద్దకి వెళ్లడంతో .. ఆయన చేసింది పెద్ద తప్పేం కాదంటూ స్వయంగా సీఎం ఆ విషయం పై మాట్లాడి,ఆ అధికారిని తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే .. ప్రొటో కాల్ రూల్స్ ప్రకారం సీఎం, ఆయన వెంట వచ్చిన అధికారులకు మంచి ఆహారం అందించడం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్‌ పని. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ బుధవారం ఇండోర్‌ లో పర్యటించారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న స్వామి అనే అధికారి పొరపాటున పర్యటించిన సందర్భంగా చల్లటి చపాతీలు వడ్డించారు. దాంతో విధులు సక్రమంగా నిర్వర్తించలేదన్న కారణంతో ఆయనపై సంబంధిత అధికారులు వేటు పడింది. కాగా, ఈ విషయం సీఎం శివరాజ్‌ సింగ్‌ కు తెలియడంతో వెంటనే ఆయన్ను విధుల్లోకి తిరిగి తీసుకోవాంటూ కలెక్టర్‌ కు ఆదేశాలు జారీ చేశారు. తాను ఒక సాధారణ వ్యక్తినని, పొడిబారిన, చల్లటి చపాతీలు తినడాన్ని తాను పట్టించుకోనని వెల్లడించారు. అలాగే ఇంత చిన్న విషయానికి ఒక అధికారిని సస్పెండ్ చేయకూడదంటూ ఉన్నతాధికారులకు తెలిపారు. పూర్తి నిబద్ధతతో ప్రభుత్వానికి సేవలు అందించాలంటూ తెలిపారు.