Begin typing your search above and press return to search.

చంద్రబాబుపై ఎంపీ సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు ..

By:  Tupaki Desk   |   6 March 2021 8:30 AM GMT
చంద్రబాబుపై ఎంపీ సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు ..
X
ఏపీ సీఎం చంద్రబాబుపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓడిపోయి మతం పేరుతో బాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. శ్రీవేంకటేశ్వరస్వామి వారి భక్తులందరికీ విసుగు పుట్టించేలా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ని క్రైస్తవీకరిస్తున్నారంటూ ఒక వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి సంచలన ఆరోపణలు చేశారు.

అసలు అలా తప్పుడు ప్రచారం చేసే వాటిలో ఒక చానల్ ‌పై మొదటగా పరువు నష్టం కేసు దాఖలు చేయనున్నట్టు తెలిపారు. ఈ మేరకు సుబ్రమణ్య స్వామి శుక్రవారం ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ ఒక వర్గం మీడియా టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తుండడం శ్రీవేంకటేశ్వర స్వామి భక్తుడిగా నాకు విసుగు తెప్పించింది అని , చంద్రబాబు ఆర్థిక సాయం అందజేసే మీడియా సంస్థలే ఈ తరహా తప్పుడు వార్తలప్రచారానికి పాల్పడుతున్నాయి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు పై ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఎంపీ సుబ్రమణ్యస్వామి కి ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా పలుమార్లు అయన చంద్రబాబు పై కొంచెం ఘాటుగానే స్పందించారు. ఏపీలో ఆలయాల పై దాడులు చోటు చేసుకున్న సమయంలో కూడా అది ప్రతిపక్ష నేత చంద్రబాబు కుట్రేనని ఆయన ఆరోపించారు.ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే అక్కసుతో కొందరు ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం లాంటి చర్యలకు పాల్పడుతున్నారని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి స్పష్టం చేశారు. టీటీడీ ఆదాయ వ్యయాలను కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌)తో ఆడిట్‌ చేయించాలని ముఖ్యమంత్రి ‌ జగన్‌మోహన్‌రెడ్డి గొప్ప నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి దేశంలో వైఎస్‌ జగన్‌ ఒక్కరే అని అన్నారు.