Begin typing your search above and press return to search.

లవ్ మ్యారేజ్ ఎఫెక్ట్.. అబ్బాయి ఇంట్లో ఐదుగురిని చంపేశారు

By:  Tupaki Desk   |   12 July 2020 8:30 AM GMT
లవ్ మ్యారేజ్ ఎఫెక్ట్.. అబ్బాయి ఇంట్లో ఐదుగురిని చంపేశారు
X
విన్నంతనే వణికిపోయే ఉదంతంగా దీన్ని చెప్పాలి. డిజిటల్ యుగంలోనూ అనాగరికంగా సాగిన ఈ హత్యాకాండ గురించి తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. మారిన కాలానికి తగినట్లుగా.. ఇటీవల కాలంలో ప్రేమ పెళ్లిళ్ల విషయంలో పెద్దలు సానుకూలంగా స్పందిస్తున్న వేళ.. అందుకు భిన్నంగా దారుణ హింసాకాండ చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్రంలోని సింధనూరులో ఐదు నెలల క్రితం 31 ఏళ్ల మౌనేశ్.. మంజుల (31) అనే అమ్మాయిని ప్రేమించి.. పెళ్లి చేసుకున్నారు.

ఈ పెళ్లి వ్యవహారం మంజుల ఇంట్లో వారికి ఏ మాత్రం ఇష్టం లేదు. తమ అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్న అబ్బాయి మీద కత్తులు నూరుతున్న అమ్మాయి తరఫు వారు..తాజాగా కొత్త దంపతులు వారి ఊరికి వెళ్లినట్లుగా తెలుసుకున్నారు. అంతే.. ఆగ్రహంతో ఊగిపోయిన వారు.. ఆ యువకుడి ఊరికి వెళ్లారు. ఇంట్లోని వారిని దొరికినోళ్లను దొరికినట్లుగా చంపేశారు.

ఈ ఉదంతంలో యువకుడి అన్న.. వదిన.. మరో అన్న.. తల్లితో పాటు మరొకరిని చంపేశారు. ఈ దాడి నుంచి మాత్రం యువతీయువకుడు మాత్రం తప్పించుకొని పారిపోయారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారటమే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఎంత ప్రేమ వివాహం చేసుకుంటే మాత్రం మరీ ఇంతలా దారుణకాండకు పాల్పడటమా? అన్న విస్మయానికి లోనవుతున్నారు.