Begin typing your search above and press return to search.

ప‌వ‌న్, లోకేష్.. స్క్రిప్ట్ లు తారుమారు అయ్యాయా?

By:  Tupaki Desk   |   11 Dec 2019 6:16 AM GMT
ప‌వ‌న్, లోకేష్.. స్క్రిప్ట్ లు తారుమారు అయ్యాయా?
X
తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేన అధిప‌తి ప‌వ‌న్ క‌ల్యాణ్, చంద్ర‌బాబు నాయుడి త‌న‌యుడు నారా లోకేష్ ల ట్విట‌ర్ ఖాతాల‌ను ఒక‌రే మెయింటెయిన్ చేస్తూ ఉన్నార‌నే ఆరోప‌ణ ఒక‌టి ఉంది. ఎక్క‌డ పెన వేసుకుందో కానీ.. చంద్ర‌బాబు, ప‌వ‌న్ ల బంధం గ‌ట్టిగా సాగుతూ ఉంది. చంద్ర‌బాబు ర‌క్ష‌కుడిగా ప‌వ‌న్ క‌ల్యాణ్ కొన‌సాగుతూ ఉన్నార‌నే అభిప్రాయాలున్నాయి. ఇలాంటి నేప‌థ్యంలో వారి ట్విట‌ర్ ఖాతాలు కూడా ఒకే చోట నుంచినే ర‌న్ అవుతున్నాయ‌నే ఆరోప‌ణ‌లు ఉండ‌టం గ‌మ‌నార్హం.

అలాగే వీరి ట్విట‌ర్ ఖాతాల నుంచి పోస్ట్ అయ్యేది కూడా ఒకే స‌బ్జెక్టులే అయ్యుంటాయి. తెలుగుదేశం పార్టీ టేక‌ప్ చేసే అంశాల‌నే ప‌వ‌న్ క‌ల్యాణ్ ట్వీట్ చేస్తూ ఉంటారు. అలాగే ప‌వ‌న్ క‌ల్యాణ్ ట్విట‌ర్ ఖాతాలో పోస్ట‌య్యే ఫొటోలు, వీడియోలు కూడా టీడీపీ ఆఫీసు నుంచినే వెళ్తాయ‌నే ప్ర‌చారం ఒక‌టి ఉంది.

ఇప్పుడు అందుకు సంబంధించి మ‌రో వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 'న‌న్ను చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు భ‌య‌ప‌డుతున్నారు.. ' అంటూ లోకేష్ డైలాగ్ గురించి ఇప్పుడు నెటిజ‌న్ల‌లో చ‌ర్చ జ‌ర‌గుతూ ఉంది.

వాస్తవానికి ఇలాంటి డైలాగులు సాధార‌ణంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ద‌గ్గ‌ర నుంచి వ‌స్తూ ఉంటాయి. త‌న‌ను చూసి సీఎం జ‌గ‌న్ భ‌య‌ప‌డుతూ ఉన్నాడ‌ని ప‌వ‌న్ ఇటీవ‌ల కూడా వ్యాఖ్యానించారు. ఈ త‌ర‌హా డైలాగులు అన్నీ ప‌వ‌న్ నుంచి వ‌స్తుంటాయి. ఇప్పుడు లోకేష్ నుంచి వ‌చ్చాయి. బ‌హుశా ప‌వ‌న్ క‌ల్యాణ్ అందాల్సిన స్క్రిప్ట్ లోకేష్ కు అందిందా? అంటూ కొంద‌రు నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తూ ఉన్నారు. లోగుట్టు లోకేష్ కే తెలియాల‌ని అంటున్నారు.