Begin typing your search above and press return to search.

ఫుల్లుగా తన మద్యం తాగుతోందని భార్యను ఈ భర్త ఏం చేశాడో తెలుసా?

By:  Tupaki Desk   |   29 Jun 2022 11:30 PM GMT
ఫుల్లుగా తన మద్యం తాగుతోందని భార్యను ఈ భర్త ఏం చేశాడో తెలుసా?
X
తనకంటే మూడేళ్లు పెద్దది అయిన యువతిని ఆ యువకుడు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన తర్వాత మూడేళ్లు సంతోషంగా కాపురం చేశారు. మద్యం సేవిస్తున్న భర్త ఇంటికి లిక్కర్ స్టాక్ తీసుకొని భద్రపరుచుకొని తాగుతుంటాడు. తాను ఇంటికి తెచ్చుకున్న మద్యం ఖాళీ అవుతోందని.. మద్యం మత్తులో నేనే తాగేసి ఉంటానని భర్త అనుకున్నాడు. ఎప్పుడూ అలాగే లిక్కర్ బాటిల్ ఖాళీ అవుతుండడంతో భర్తకు అనుమానం వచ్చింది.

అర్ధరాత్రి లిక్కర్ బాటిల్ మీద, అతడి భార్య మీద నిఘా వేశాడు. అర్థరాత్రి భర్త నిద్రపోయాడని అనుకున్న భార్య లిక్కర్ బాటిల్ ఖాళీ చేసి ఆమె కూడా సైలెంట్ గా నిద్రపోయింది.

తన భార్యకు మద్యం తాగే అలవాటు ఉందని తెలుసుకున్న భర్త షాక్ అయ్యాడు. భర్త మ్యాటర్ లీక్ అయ్యిందని భార్యకు తెలిసిపోయింది. భర్త బయటకు వెళ్లిన తర్వాత ఎక్కువగా బయట తిరుగుతున్న భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ రానురాను వీరతాగుబోతు అయ్యింది. రోజా భర్త కంటే ఎక్కువగా భార్య మద్యం సేవించడం మొదలుపెట్టింది. నా భార్య కనపడటం లేదని భర్త పోలీస్ కేసు పెట్టాడు. పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేస్తే షాకింగ్ విషయం బయటపడింది.

దేశ రాజధాని ఢిల్లీలోని దక్షిణ ఢిల్లీలోని మైదాన్ గర్హి ప్రాంతంలో సునీల్ కుమార్(32) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఉత్తరప్రదేశ్ కు చెందిన మహిళలను పెళ్లి చేసుకొని కాపురం పెట్టాడు. సునీల్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు.మద్యం సేవించే సునీల్ ఇంటికి లిక్కర్ బాటిల్స్ తెచ్చుకొని పెట్టుకుంటాడు. అయితే ఇంటికి తెచ్చిన మధ్యం ఖాళీ అవుతుండడంతో ఓ రోజు రాత్రి పడుకున్నట్టు నటించి భార్య లిక్కర్ సేవనం ప్రత్యక్షంగా చూసి షాక్ తిన్నాడు.

భార్య భర్తల మధ్య ఈ మద్యపానం గొడవలకు దారితీసింది. అనంతరం భర్త బెదిరింపులను పక్కనపెట్టి బయట తిరగడం మొదలుపెట్టింది. వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని అతడితో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది.

భార్య అక్రమ సంబంధాన్ని సునీల్ నిలదీశాడు. తన భార్య రేఖ అక్రమ సంబంధం పెట్టుకోవడంపై కోపంతో రగిలిపోయిన సునీల్ తమ్ముడికి విషయం చెప్పాడు. ఓరోజు జూన్ 13న భార్య కనిపించడం లేదని పోలీసుల కేసు పెట్టాడు సునీల్. పోలీసులు విచారణ జరిపారు. పోలీసుల విచారణలో సునీల్ కుమారే చంపాడని తేలింది. అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి మద్యం తాగించి తమ్ముడితో కలిసి చంపానని ఒప్పుకున్నాడు. భార్య శవాన్ని అటవీప్రాంతంలో పాతిపెట్టానని చెప్పాడు. హత్యకు సహకరించిన తమ్ముడు చోటు పరారీలో ఉన్నట్టు పోలీసులు కనిపెట్టారు.