Begin typing your search above and press return to search.

కరోనావైరస్ ని కేరళ ఎలా అరికట్టిందంటే ...!

By:  Tupaki Desk   |   28 March 2020 8:30 PM GMT
కరోనావైరస్ ని కేరళ ఎలా అరికట్టిందంటే ...!
X
కరోనా వైరస్ ..ఈ మహమ్మారి నుండి బయటపడటానికి ప్రపంచ దేశాలన్నీ కూడా కరోనా పై యుద్ధం ప్రకటించి పోరాడుతున్నాయి. ఇకపోతే మన దేశంలో కేరళ రాష్ట్రంలోనే మొట్టమొదటి కరోనా కేసు నమోదైంది. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలోనే అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో అక్కడ ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమౌతుందననే భయాలు అందరిలోనూ నెలకొన్నాయి. కానీ..అక్కడి పినరయి ప్రభుత్వం తీసుకున్న మెరుగైన చర్యలతో వైరస్ సోకిన వారు కోలుకుంటున్నారు.

అబ్జర్ వేషన్ లో ఉన్న వారి సంఖ్య 31 వేలకు చేరుకుంది. 237 మందిని ఐసోలేషన్ వార్డుల్లో చేర్చారు. ఇప్పటి వరకు 2 వేల 921 నమూనాలను పరీక్షల కోసం పంపారు. వాటిలో 2 వేల 342 మందికి నెగటివ్ రాగా..28 మందికి పాజిటివ్ వచ్చింది. అందులో ముగ్గురు రికవరీ అయ్యారు. కేరళలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 176కి చేరుకోగా.. వీరిలో 12 మంది డిశ్చార్జి అయ్యారు. కేరళలోని మొత్తం 14 జిల్లాలు కరోనా బారినపడ్డాయి.

అయితే , కరోనా వ్యాప్తి చెందకుండా చూడాలి అంటే ... కరోనా లక్షణాలున్న వారిని వెంటనే గుర్తించి..వారిని ఇతరుల దగ్గర నుంచి వేరుగా ఉంచడం మొదటి ప్రాధాన్యతగా గుర్తించింది. వీరు ఎక్కడెక్కడ తిరిగారు ? ఎవరెవరితో కలిసి ఉన్నారు. ఈ కీలకమైన సమాచారాన్ని సేకరించగలిగింది. వీటిని గుర్తించడంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో సక్సెస్ ఫుల్ అయ్యింది. మూడెంచల విధానాన్ని రూపొందించింది. అనుమానితులను గుర్తించడం మొదటిది. వారితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించడం రెండోది...వీరితో ఏ మాత్రం సంబంధం లేని వారిని గుర్తించడం మూడోది..వీరందరీ సమాచారాన్ని అత్యంత పకడ్బందీగా చేపట్టింది. ఇలా చేయడంతో వైరస్ మరింత వ్యాపించకుండా కట్టడి చేసింది.

తొలుత ఇక్కడ మూడు కేసులు రికార్డయ్యాయి. సుమారు 500 మందిని విడి విడి గదుల్లో ఉంచి 14 రోజుల పాటు వీరు బయటకు రాకుండా కట్టడి చేయగలిగింది. పూర్తిగా పరీక్షలు నిర్వహించిన తర్వాత..ఏమీ లేదని తేలే వరకు వారిని అక్కడనే ఉంచేవారు. విదేశాల నుంచి వచ్చే వారు కేరళకు చేరుకుంటారని భావించి - ముందుగానే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఇళ్లలోనూ అనుమానితులను ఒక గదిలో, మిగిలిన కుటుంబసభ్యులు మరో గదిలో ఉండాలని సూచించింది.

ఇకపోతే - ప్రజల ఆరోగ్య విషయంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుంది. 2018 - 2019 సంవత్సరంలో వచ్చిన నిఫా వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొంది. పెద్ద ఎత్తున్న వచ్చిన ఈ వైరస్ కారణంగా కేవలం 17 మంది మాత్రమే చనిపోయారు. దీనిపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కితాబిచ్చింది. రాష్ట్రంలో బలమైన ఆరోగ్య వ్యవస్థ ఉందని వెల్లడించింది. అంటు వ్యాధులు నిరోధించాటలంటే కేవలం ఆరోగ్య శాఖకు మాత్రమే చెందినదిగా భావించ లేదు కేరళ రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం రాష్ట్రంలోని అన్ని శాఖలు అలెర్ట్ అయ్యాయి కాబట్టే ..కేరళలో కరోనా కేసులు ఇంకా పెరగకుండా ప్రభుత్వం చేయగలిగింది.