Begin typing your search above and press return to search.

సీఎంకు చుక్కలు చూపిస్తున్న ఎమ్మెల్యేలు

By:  Tupaki Desk   |   8 April 2021 10:30 AM GMT
సీఎంకు చుక్కలు చూపిస్తున్న ఎమ్మెల్యేలు
X
కర్ణాటక రాజకీయాల్లో ఈనెల 17వ తేదీన ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర రాజకీయాలను 17వ తేదీ షేక్ చేయబోతోంది. పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు సీఎం యడ్యూరప్పపై తిరుగుబాటు చేసే అవకాశం ఉందని బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాళ్ బాంబు పేల్చారు.

బెళగావి జిల్లాలో విలేకరులతో మాట్లాడిన బసవనగౌడ ఎవరి బలం ఏంటో.. బలహీనత ఏంటో కాలమే నిర్ణయిస్తుందన్నారు. సూర్యచంద్రులు ఉండేవరకు యడ్యూరప్ప మాత్రమే సీఎంగా కొనసాగుతారా? అని ప్రశ్నించారు.ఇప్పటి వరకు యడ్డీ సీఎంగా ఉండడం ఆయన అదృష్టంగా భావించాలన్నారు.

మే 2 తర్వాత కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి మార్పు ఉండవచ్చునని అన్నారు. ఉత్తర కర్ణాటకకు చెందిన వ్యక్తిని సీఎంను చేయడానికి పార్టీ నేతలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బసవనగౌన తెలిపారు.

యడ్యూరప్పపై అవినీతి ఆరోపణలు రావడం.. పలువురికి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో వారంతా గుర్తుగా ఉన్నారు. ఇప్పుడు యడ్డీపై తిరుగుబాటు చేసేందుకు వారంతా రెడీ అయినట్లు తెలుస్తోంది.