Begin typing your search above and press return to search.

ఫ్లాష్ న్యూస్ ..కన్నా కోడలి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి !

By:  Tupaki Desk   |   29 May 2020 11:10 AM GMT
ఫ్లాష్ న్యూస్ ..కన్నా కోడలి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి !
X
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యింది. ఉస్మానియా ఫోరెన్సిక్ నిపుణులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి నేతృత్వంలో సుహారిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా శరీరంలో ఎలాంటి గాయాలు కనిపించలేదు. దీంతో ఆమె గుండె పోటుతోనే మరణించారని ప్రాథమికంగా తేల్చారు. ఆమె మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని డాక్టర్లు తెలిపారు. ఫోరెన్సిక్ రిపోర్టు రావడానికి మరో 15 రోజుల సమయం పడుతుంది.

నిన్న స్నేహితుడి ఇంట్లో సుహారిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. రాయదుర్గంలోని స్నేహితుడి ఇంట్లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలింది. అయితే మధ్యాహ్నం 12 గంటలకు సుహారిక చనిపోతే సాయంత్రం వరకు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం పలు అమానాలకు తావిస్తోంది. పార్టీ జరిగిన ప్రాంతంలో పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. పార్టీలో పాల్గొన్న వారిని విచారిస్తున్నారు.

సుహారికతోపాటు ఆమె చెల్లెలి భర్త ప్రవీణ్ రెడ్డి కూడా ఈ పార్టీకి హాజరయ్యారని సమాచారం చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ కలుసుకోవడంతో గెట్ టుగెదర్ ఏర్పాటు చేయగా ఆనందంతో డ్యాన్స్ చేసిన 32 ఏళ్ల సుహారిక అకస్మాత్తుగా కుప్పకూలి చనిపోయింది. చిన్న వయసు కావడం, ఆకస్మికంగా చనిపోవడంతో పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేశారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం గుండెపోటుతో సుహారిక చనిపోయి ఉంటుందని, ఎలాంటి అనుమానాలు లేవని చెప్పినట్లుగా పోలీసులు చెబుతున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే సుహారిక మరణం విషయంలో పూర్తి వివరాలు వెల్లడవుతాయి.