Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ : నల్గొండ జిల్లాలో ఎమ్మెల్యేల వాగ్వాదం !

By:  Tupaki Desk   |   19 Feb 2020 11:52 AM GMT
బ్రేకింగ్ : నల్గొండ జిల్లాలో ఎమ్మెల్యేల వాగ్వాదం !
X
సాధారణంగా అధికార పక్షం ఎమ్మెల్యే లకి, విపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు అంతగా పొసగదు. ఇది రాజకీయాలలో సర్వ సాధారణం. ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొచ్చింది అని అధికార పక్షం నేతలు ఒకవైపు చెప్పుకొని తిరుగుతుంటారు. మరోవైపు ప్రభుత్వం పాలనని గాలికి వదిలేసింది అని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. ప్రస్తుత రాజకీయాలలో ఈ విషయం చాలా కామన్. ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినా ప్రతిపక్ష పార్టీ నేతలు పొగడరు. అలాగే ప్రభుత్వం పై వారు ఎన్ని విమర్శలు చేసినా ... ప్రభుత్వం చేసే అభివృద్ధిని చూసి ఓర్వలేక , రాజకీయ మనుగడకోసం ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తున్నారు అని అధికార పార్టీ నేతలు చెప్తుంటారు.

ఇక ఏదైనా సభా ముఖంగా అధికార పక్షం , ప్రతిపక్షం నేతలు కలిస్తే ..వారి మధ్య ఒక చిన్నపాటి యుద్ధం జరుగుతుంది. ప్రజలకి ఎన్నో చేసాం అని అధికార పక్షం నేతలు ...ఏమి చేయలేదు అని ప్రతిపక్షం నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, టీఆర్ ఎస్ ఎమ్మెల్యే కంచర్ల గోపాల్‌ రెడ్డి మధ్య అభివృద్ధి విషయంలో తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి మాట్లాడుతుండగా నిధులు‌ విడుదల చేయకుండా అభివృద్ధి ఎలా సాధ్యమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. దీంతో కోట్ల రూపాయల నిధులు విడుదలవుతుంటే ఎమ్మెల్యేకి కళ‌్లు కన్పించడం లేదా అంటూ గట్టిగా ఆయనకి సమాధానం చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఒకానొక దశలో కొట్టుకునే వరకు వెళ్లడంతో , అక్కడ ఉన్న పోలీసులు వెంటనే కలగజేసుకొని, ఇద్దరు ఎమ్మెల్యేలకు సర్ది చెప్పి ఆ గొడవకి ఫుల్ స్టాప్ పెట్టారు.