Begin typing your search above and press return to search.

ఆ రెండు పార్టీలు కలిస్తే భారీ ఎఫెక్ట్... ?

By:  Tupaki Desk   |   16 Jan 2022 2:30 AM GMT
ఆ రెండు పార్టీలు కలిస్తే భారీ ఎఫెక్ట్... ?
X
ఏపీలో జనసేన టీడీపీల మధ్య పొత్తు ఉంటుంది అని అంతా అంటున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి చుక్కలు చూపించేలా ఈ పొత్తు ఉంటుంది అని అంతా భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా విశాఖ జిల్లా విషయానికి వస్తే జనసేన టీడీపీ పొత్తుతో మెజారిటీ సీట్లు వైసీపీ కోల్పోతుందా అన్న చర్చ అయింతే ఉంది. విశాఖ జిల్లాలో 15 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ఇందులో 11 ఎమ్మెల్యే సీట్ల‌ను 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుచుకుంది.

కేవలం సిటీలోని నాలుగు సీట్లు మాత్రమే టీడీపీకి దక్కాయి. ఇక 2014 ఎన్నికలను తీసుకుంటే బీజేపీ టీడీపీ జనసేన పొత్తు వల్ల కేవలం మూడు సీట్లు తప్ప మొత్తానికి మొత్తం కూటమి ఊడ్చేసింది. 2024లో కూడా అలాంటి సీనే ఉంటుందా అన్నదే అందరి ఆలోచనగా ఉందిట. బీజేపీని పక్కనపెట్టి జనసేన టీడీపీ కలిసినా కూడా చాలా సీట్లు వైసీపీ మిస్ అవాల్సి ఉంటుంది అంటున్నారు.

అందులో భీమిలీ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. అలాగే గాజువాక, విశాఖ నార్త్, విశాఖ వెస్ట్ విశాఖ తూర్పు, పెందుర్తి, అనకాపల్లి, ఎలమంచిలి. చోడవరం, పాయకరావుపేట వంటివి ఉంటాయని అంటున్నారు. ఇక విశాఖ సౌత్, పెందుర్తి, నర్శీపట్నం, మాడుగుల, ఏజెన్సీలోని రెండు సీట్ల మీద వైసీపీకి గ్యారంటీ ఉంటుందని అంటున్నారు.

అంటే పొత్తుల ఎత్తులతో విశాఖలో మొత్తం 15 సీట్లకు తొమ్మిది దాకా టీడీపీ, జనసేన కూటమికి దక్కితే మాత్రం వైసీపీకి రాజకీయంగా గట్టి షాకే అంటున్నారు. అయితే రాజకీయాల్లో గణిత శాస్త్రం ఎపుడూ పనికిరాదు. ఇక 2014 వేరు, 2024 వేరు అని కూడా అంటారు. అపుడు వైసీపీ విపక్షంలో ఉంది. ఇపుడు అధికారంలో ఉంది. దానితో పాటు గతంలో బలం లేని చోట కూడా ఇపుడు పట్టు పెంచుకుంది. అలాగే విశాఖ లాంటి టీడీపీ కంచుకోటలో కూడా పాగా వేసింది.

దానికి తోడు టీడీపీ నుంచి చాలా మంది నేతలు వైసీపీలో చేరిపోయారు. టీడీపీకి కొన్ని చోట్ల పూర్వం బలం లేదు అంటున్నారు. అందువల్లల జనసేన టీడీపీ పొత్తు గతంలో మాదిరిగా హిట్ అవుతుందా అన్నది కూడా వైసీపీ నేతల ప్రశ్నగా ఉంది. చూడాలి మరి ఎవరికి కరెక్ట్ అవుతుంది ఎవరిది రాంగ్ అవుతుంది అన్నది మాత్రం ఓటర్ల చేతిలోనే ఉంది. అయితే 2019లో ఆయా పార్టీలకు పడిన ఓట్లను చూస్తే కనుక కచ్చితంగా ఈ సీట్లు కూటమికి వస్తాయనే అంటున్నారు.