Begin typing your search above and press return to search.

ఏపీ రాజధానిపై జగన్ డేరింగ్ స్టెప్

By:  Tupaki Desk   |   10 Aug 2020 2:15 PM GMT
ఏపీ రాజధానిపై జగన్ డేరింగ్ స్టెప్
X
గవర్నర్ ఆమోదించడంతో విశాఖకు పరిపాలన రాజధాని తరలింపులో జగన్ సర్కార్ వేగం పెంచింది. ఈ మేరకు సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం స్పెషల్ లీవు పిటీషన్ దాఖలు చేసింది. తాజాగా అత్యవసర విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేసింది.

మూడురాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదించినా ఏపీ హైకోర్టు మాత్రం ఈ నెల 14వరకు స్టేటస్ కో విధించిన సంగతి తెలిసిందే. దీనిపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే విచారణకు రాకపోవడంతో అత్యవసరంగా విచారించాలంటూ సుప్రీం కోర్టుకు లేఖ రాసింది.

ఏపీ పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై హైకోర్టు ఇచ్చిన ‘స్టేటస్ కో’ను ఎత్తివేయాలంటూ ఏపీ ప్రభుత్వం తాజాగా సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ కు లేఖ రాసింది. ప్రతివాదులకు పిటీషన్ కాపీ పంపినందున వీలైనంత త్వరగా కేసుపై విచారణ జరపాలని ప్రభుత్వం లేఖలో కోరింది.