Begin typing your search above and press return to search.

12000 మంది ఉద్యోగులను తొలగించేందుకు 'ఫేస్ బుక్'రెడీ?

By:  Tupaki Desk   |   6 Oct 2022 12:30 PM GMT
12000 మంది ఉద్యోగులను తొలగించేందుకు ఫేస్ బుక్రెడీ?
X
ప్రపంచ ప్రఖ్యాత సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ ను కూడా ఆర్థిక మాంద్యం వెంటాడుతోంది. ఫేస్ బుక్ యాజమాన్య సంస్థ 'మెటా' ఈ మేరకు మాంద్యం దెబ్బకు ఉద్యోగులను తొలగించేందుకురెడీ అవుతోంది. మెటా సంస్థ తమ అనుబంధ కంపెనీ అయిన ఫేస్‌బుక్‌లో ' ఉద్యోగుల నిశ్శబ్ద తొలగింపులను' నిర్వహిస్తోంది. వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు తెలిసింది. కనీసం 12,000 మందిని పక్కనపెడుతున్నట్టు సమాచారం. దాని మొత్తం కంపెనీలోని ఈ ఉద్యోగుల సంఖ్య 15 శాతం కావడం గమనార్హం.

ఇన్‌సైడర్‌లోని ఒక నివేదిక ప్రకారం.. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, పనితీరు తక్కువగా ఉన్న ఐటీ ఉద్యోగుల "నిశ్శబ్ద తొలగింపులను" అమలు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. చాలా మంది ఉద్యోగులు ఇన్‌సైడర్‌తో మాట్లాడుతూ రాబోయే కొద్ది వారాల్లో 15 శాతం మంది ఫేస్ బుక్ నుంచి తొలగించనున్నారని సమాచారం. అంటే దాదాపు 12,000 మంది ఉద్యోగులు త్వరలో ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. వాస్తవానికి ఉద్యోగులను బలవంతంగా బయటకు పంపబడుతున్నారు," అని ఉద్యోగి ఇన్‌సైడర్‌తో చెప్పారు.

సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం హైరింగ్ ఫ్రీజ్‌ను ప్రకటించింది. కొత్తగా ఉద్యోగులను తీసుకోవడం లేదు. ఇది ప్రకటించినప్పటి నుంచి ఫేస్‌బుక్ తన ఉద్యోగులను నెలల తరబడి తొలగింపుల ప్రక్రియు కొనసాగిస్తోంది. గరిష్ట స్థాయిలో మెటా యొక్క స్టాక్ ధర ఒక్కో షేరుకు $380కి చేరుకుంది. అయితే గత ఏడాదితో పోల్చితే కంపెనీ షేరు ధర 60 శాతం క్షీణించింది.

మెటా ఫౌండర్ మరియు సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, సోషల్ నెట్‌వర్క్ బోర్డు అంతటా నియామకాలను స్తంభింపజేశామని.. మరిన్ని తొలగింపులు మున్ముందు ఉన్నాయని హెచ్చరించారు. ఉద్యోగులకు అంతర్గత కాల్ సందర్భంగా జుకర్‌బర్గ్ ఈ వ్యాఖ్యలు చేశారు. జుకర్‌బర్గ్ మాట్లాడుతూ "వచ్చే సంవత్సరంలో హెడ్‌కౌంట్ వృద్ధిని క్రమంగా తగ్గించడమే మా ప్రణాళిక. చాలా బృందాలు కుదించబోతున్నాం. కాబట్టి మేము శక్తిని ఇతర ప్రాంతాలకు మార్చగలము." అంటూ ఉద్యోగుల బదిలీలు ఉంటాయని స్పష్టం చేశారు.

మేలో జుకర్‌బర్గ్ మెటాలోని కొన్ని విభాగాలను ప్రభావితం చేసే హైరింగ్ ఫ్రీజ్‌ను ప్రకటించారు. అయితే అతను ఇప్పుడు డిపార్ట్‌మెంట్‌లు.. నియామకాల ఫ్రీజ్‌ను విస్తరించాడు. ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా ప్రస్తుతం ఆర్థిక మాంద్యం మధ్య ఖర్చులను తగ్గించుకోవడానికి సిబ్బందిని తగ్గిస్తుంది. స్పష్టంగా కంపెనీలో ఉద్యోగులు నిష్క్రమించడానికి 30 నుండి 60 రోజుల టైం ఇస్తూ సాలరీలు అడ్వాన్స్ గా ప్రకటించి ముందుకెళుతోంది.

మెటా ఇప్పటికే కొత్త ఉద్యోగాలు ప్రయత్నించాలని.. తీసేస్తున్నామని కొందరు ఉద్యోగులకు స్పష్టం చేసింది." ఇక్కడ ఉద్యోగాలు తొలగించబడిన ఉద్యోగులు ఒక నెలలోపు అంతర్గతంగా కొత్త ఉద్యోగాన్ని కనుగొనలేకపోతే వారు తొలగింపునకు లోబడి ఉంటారని తెలిపింది.

బిగ్ టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగించి, కొత్త నియామకాలను స్తంభింపజేస్తున్నందున.. వచ్చే ఏడాదిలో ఉద్యోగుల సంఖ్య వృద్ధిని క్రమంగా తగ్గించడమే కంపెనీ ప్రణాళిక అని జుకర్‌బర్గ్ జూలైలో చెప్పారు. సోషల్ నెట్‌వర్క్ ఆర్థిక మాంద్యంలోకి ప్రవేశించిందని, అది డిజిటల్ అడ్వర్టైజింగ్ బిజినెస్‌పై విస్తృత ప్రభావాన్ని చూపుతుందని జుకర్‌బర్గ్ అంగీకరించారు. చాలా "జట్లు కుంచించుకుపోతున్నాయి కాబట్టి మేము కంపెనీలోని ఇతర ప్రాంతాలకు శక్తిని మార్చగలము" అని అన్నారు.మొత్తంగా ప్రపంచ దిగ్గజాలకే ఆర్థిక మాంద్యంతో ఉద్యోగులను తొలగిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి భారత దేశంలో మాంద్యం మబ్బులు ఇప్పుడైతే కమ్ముకోలేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.