Begin typing your search above and press return to search.

అమెరికాలో కారు ప్రమాదం: ఒక్కరు తప్ప భారతీయ కుటుంబం దుర్మరణం

By:  Tupaki Desk   |   25 Jun 2022 4:47 AM GMT
అమెరికాలో కారు ప్రమాదం: ఒక్కరు తప్ప భారతీయ కుటుంబం దుర్మరణం
X
అమెరికాలో రోడ్డు ప్రమాదాల పరంపర కొనసాగుతోంది. ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో తెలుగు వాళ్లు వరుసగా చనిపోతున్నారు. తాజాగా మరో విషాదం అలుముకుంది. అమెరికాలో ఈనెల 7న జరిగిన రోడ్డు ప్రమాదంలో మిర్యాలగూడ మండలం బి.అన్నారం గ్రామానికి చెందిన సారెడ్డి క్రాంతికిరణ్ రెడ్డి (24) మృతి చెందారు. తాజాగా కెంటుకీలో ఘోర ప్రమాదంలో తెలుగు కుటుంబం బలైపోయింది.

అమెరికాలోని కెంటుకీలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రవాస భారతీయ కుటుంబం అసువులు బాసింది. 41 ఏళ్ల జితు గలానీ, అతని భార్య నీతు గలానీ, 4 ఏళ్ల కొడుకుతో సహా ఒక కుటుంబం ఈ ప్రమాదంలో దుర్మరణం చెందింది. కెంటుకీ స్టేట్ పోలీసుల కథనం ప్రకారం.. ఈ ప్రమాదంలో కుటుంబంలోని ఒక 11 ఏళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.

జితు గలానీ కుటుంబం కార్టర్ కేవ్స్ స్టేట్ రిసార్ట్ పార్క్‌లో క్యాంపును ప్లాన్ చేసింది. కుటుంబ పెద్ద జితు గలానీ హోండా సిఆర్‌వి కారులో కుటుంబంతో కలిసి అక్కడికి వెళుతుడగా పార్క్‌లోకి ప్రవేశించడానికి ముందుగా పట్టు తప్పి ప్రవేశ ద్వారం వద్ద బోల్తా కొట్టింది.

ఈ ప్రమాదంలో అదే కారులో ఉన్న 11 ఏళ్ల బాలుడు మాత్రమే ప్రాణాలతో బయటపడగా, అతని తల్లిదండ్రులు, తమ్ముడు అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడు వాహనం నుండి దిగి, సహాయం కోసం పార్క్ రేంజర్‌ను పిలిచాడు.

బాలుడికి స్వల్పంగా గాయాలయ్యాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కారు నుండి బయటకు వచ్చిన తర్వాత కెంటకీ పోలీసులు బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.

అమెరికాలో కారు ప్రమాదాల పరంపర కొనసాగుతోంది. ఇందులో తెలుగు విద్యార్థులు, ప్రవాసుల దుర్మరణాలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని రోజుల కిందటే ఇల్లినాయిస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు సహా డ్రైవర్ తో ముగ్గురు మరణించారు. రోడ్డు ప్రమాదంలో రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.