Begin typing your search above and press return to search.

దేశంలో వైరస్ విశ్వరూపం..ఒక్కరోజులో దేశంలో 8,171!

By:  Tupaki Desk   |   2 Jun 2020 6:50 AM GMT
దేశంలో వైరస్ విశ్వరూపం..ఒక్కరోజులో దేశంలో 8,171!
X
దేశంలో వైరస్ మహమ్మారి రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. రోజురోజుకి వైరస్ పాజిటివ్ కేసులు బీభత్సంగా పెరిగిపోతున్నాయి. నిన్న దేశవ్యాప్తంగా 8392 కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లో కొత్తగా 8171 కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువగా వస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 1,98,706 కేసులు నమోదయ్యాయి. దీనితో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 93,323 ఉండగా, 91,818 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా, 5,394 మంది వ్యాధితో మరణించారు. రాష్ట్రాల వారీగా చూస్తే.. మహారాష్ట్రలో కేసుల సంఖ్య 70 వేలు దాటింది. ఆ తర్వాత తమిళనాడు(23,495), ఢిల్లీ(20,834), గుజరాత్(17,200) ఉన్నాయి.

ఇక ఆంద్రప్రదేశ్ విషయానికొస్తే ..ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షలు నిర్వహిస్తోన్న కొద్దీ పాజిటివ్ కేసులు భారీగా బయటపడుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 12,613 శాంపిళ్లను పరీక్షించగా మరో 82 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 24 గంటల్లో 40 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కేసులు 3200 కాగా... వాటిలో 2209 మంది డిశ్చార్జి అయ్యారు. ఇక యాక్టివ్ కేసులు 927గా ఉన్నాయి. .యాక్టివ్ కేసుల సంఖ్య కొద్దికొద్దిగా పెరుగుతోంది. మృతుల సంఖ్య మొత్తం 64కి చేరింది.

ఇక, తెలంగాణ విషయానికి వస్తే.. సోమవారం 94 కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,792కి చేరింది. వీరిలో 434 మంది విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, వలస కార్మికులు ఉన్నారు. ఏపీలో నిన్న ఉదయం 9 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3118గా ఉంది. అందులో 2169 మంది డిశ్చార్జి అయ్యారు. 64 మంది చనిపోయారు.