Begin typing your search above and press return to search.

రెండు బైకులు.. ఆరుగురు కుర్రాళ్లు మార్కెట్లోకి వచ్చారు కట్ చేస్తే..

By:  Tupaki Desk   |   16 Jun 2021 1:30 PM GMT
రెండు బైకులు.. ఆరుగురు కుర్రాళ్లు మార్కెట్లోకి వచ్చారు కట్ చేస్తే..
X
దారుణ నేరాలకు.. సంచలన ఉదంతాలకు.. విచ్చలవిడితనానికి కేరాఫ్ అడ్రస్ గా బిహార్ పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఆ రాష్ట్రాన్ని దాటేసేలా ఉత్తరప్రదేశ్ లో నేర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ కనిపించని షాకింగ్ ఉదంతం ఒకటి రాజస్తాన్ లో చోటు చేసుకుంది. సినిమాల్లో కూడా ఇలాంటి సీన్ కనిపించదేమో? ఇంతకూ జరిగిందేమంటే?

రాజస్థాన్ లోని కోట జిల్లా మార్కెట్ లోకి పట్టపగలు.. రెండు బైకుల మీద ఆరుగురు కుర్రాళ్లు వచ్చారు. వచ్చిన వెంటనే ఒక బైక్ మీద నుంచి ఒకడు కిందకు దిగారు.. మరొకరు వేలు చూపిస్తున్నారు. అంతే జేబులో నుంచి గన్ చేతికి రావటం.. వరుస పెట్టి కాల్చేయటం జరిగింది. హటాత్తుగా చోటు చేసుకున్న ఈఉదంతానికి మార్కెట్లోని వారంతా షాక్ అయ్యే పరిస్థితి.

ముఖానికి గుడ్డలు కట్టుకొని వచ్చిన వారిని గుర్తించలేని పరిస్థితి. అయితే.. వారి కాల్పుల నుంచి స్థానిక వ్యాపారి కైలాష్ మీనా త్రుటిలో తప్పించుకున్నారు. ఇంట్లో ఉన్న అతన్ని పేరుపెట్టిపిలిచి.. బయటకు వచ్చినంతనే కాల్పులకు తెగపడ్డారు. లక్కీగా అతను తప్పించుకున్నాడు. ఈ ఉదంతం అక్కడి సీసీ కెమేరాల్లో నమోదైంది. దీని ఆధారంగా నిందితుల్ని పోలీసులు గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

తనకు ఎవరితోనూ శత్రుత్వం లేదని బాధిత వ్యాపారి చెబుతున్నా.. అతడి మాట తీరు దురుసుగా ఉంటుందని స్థానికులు ఆరోపించారు. ఇంతకీ.. చంపేసంతలా టార్గెట్ ఎందుకు చేశారన్నదిఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సినిమాల్లోని క్రైం సీన్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉన్న ఈ వైనం షాకింగ్ గా మారింది. నిందితుల్ని అదుపులోకి తీసుకోవటం కోసం పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ 38 సెకన్ల నిడివి ఉన్న షాకింగ్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.