Begin typing your search above and press return to search.

మూఢవిశ్వాసాలతో కన్న కూతుర్లనే చంపేసిన భార్యభర్తలు..!

By:  Tupaki Desk   |   25 Jan 2021 3:35 AM GMT
మూఢవిశ్వాసాలతో కన్న కూతుర్లనే చంపేసిన భార్యభర్తలు..!
X
పురుషోత్తమ్ నాయుడు, పద్మజ దంపతులు ఉన్నత విద్యావంతులు. పురుషోత్తమ్​ నాయుడు ఓ డిగ్రీ కళాశాలలో వైస్​ ప్రిన్సిపాల్ ​గా పనిచేస్తుండగా.. పద్మజ కూడా ఎమ్మెస్సీ గోల్డ్​ మెడలిస్ట్​. కానీ ఈ దంపతులు మూఢవిశ్వాసాలతో తమ సొంత కూతుర్లును దారుణంగా చంపేశారు. తమ కూతుర్లను మళ్లీ బతికించుకుంటామని చెబుతున్నారు. కరోనా చైనాలో పుట్టలేదని.. శివుడి తల వెంట్రుకల్లో పుట్టిందని.. త్వరలోనే ఈ యుగం అంతమైపోతుందని కూడా చెబుతున్నారు. వీళ్ల వైఖరి ఏమిటో పోలీసులకే అర్థం కావడం లేదు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

తల్లిదండ్రులు మూఢ విశ్వాసాలతో తమ కన్నకూతుర్లనే చంపేసిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో చోటుచేసుకున్నది. పురుషోత్తమ్ నాయుడు దంపతులు మదనపల్లె స్థానిక శివనగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి అలేఖ్య(27), సాయిదివ్య(22) కుమార్తెలున్నారు. అయితే అద్భుతాలు జరుగుతాయంటూ కొన్ని రోజులుగా వీళ్లు తమ ఇంట్లో రకరకాల పూజలు చేస్తున్నట్టు సమాచారం. ఆదివారం కూడా ఇంట్లో పూజలు చేశారు. పూజలు చేసే క్రమంలో తమ కూతుర్ల నోట్లో వెండి చెంబులు దూర్చి.. ఆ తర్వాత వ్యాయామం చేసే డంబెల్స్​తో కన్న తల్లే కూతుళ్ళను కొట్టి చంపింది.

అయితే ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్ధాలు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక డీఎస్పీ రవి మనోహరాచారి వెంటనే ఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ దంపతులు ఎందుకు ఇలా ప్రవర్తించారో పోలీసులకే అంతుచిక్కడం లేదు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే నరబలులు ఇవ్వడం అప్పడప్పుడు మనం వింటుంటాం. అయితే సొంత కూతుర్లను తల్లిండ్రులే హతమార్చడం. వారు కూడా ఉన్నత విద్యావంతులు కావడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఈ తల్లి దండ్రుల మానసికస్థితిపై పలు అనుమానాలు వ్యక్తమువుతన్నాయి.