Begin typing your search above and press return to search.

మనుషుల్ని తిని పందుల్ని వదిలేశారు

By:  Tupaki Desk   |   24 Jan 2021 1:30 AM GMT
మనుషుల్ని తిని పందుల్ని వదిలేశారు
X
మనిషి అన్ని జంతువులను తిని ఆరిగించుకున్నాడు. కానీ మానవుడు మనిషిని తిన్న ఉదంతాలు చరిత్రలో చాలా తక్కువగానే ఉన్నాయి. అలాంటి ఉదంతాలే జరగలేదని అనుకున్నాం.. కానీ మానవుడిని కూడా తిన్న ఘటన తాజాగా షాకింగ్ గా మారింది.మెక్సికో దేశంలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆంథ్రాపలజీ అండ్ హిస్టరీ వెలువరించిన నివేదిక ఇప్పుడు కొన్ని సంచలన విషయాలను బయటపెట్టింది.

1500 సంవత్సరంలో చోటుచేసుకున్న ఈ దారుణంలో ఓ స్పానిష్ విజేత.. తన సైన్యంతో కలిసి బంధించిన సమూహానికి చెందిన పలువురు మహిళలు, పిల్లలను దారుణంగా చంపి వారిని తిన్నాడని నివేదిక వెల్లడించింది. మీరు మనుషులను తిని.. పందులను వదిలేశారని విషయాన్ని బయటపెట్టింది.

మెక్సికోలోని టెకోయాక్ పట్టణంలో జరిపిన తవ్వకాల్లో ఈ భయానక ఘటన గురించి తెలిసింది. మనుషులను తిన్న స్థలం ఇదేనని 'అజ్జెక్ నాహుఔట్ భాష'లో రాసిన నివేదిక వెలుగుచూసింది. 1520లో టెకోయిక్ నివాసితులు స్వదేశీ సమూహాల నుంచి సుమారు 350 మంది ప్రజలను స్వాధీనం చేసుకొని బంధించి అందులో కొందరిని చంపి తిన్నారని.. వారి ఎముకలు, ఇతర సాక్ష్యాలు నిస్సార బావుల్లోకి విసిరినట్లు తవ్వకాల్లో బయటపడినట్టు వెల్లడైంది.

చాలా మంది ప్రజలు పారిపోగా.. మహిళలు, పిల్లలు బంధించబడ్డారని.. వారి ఎముకలే కనిపించాయని.. వారినే చంపి తిన్నారనే విషయం బయటపడింది. ఈ విషం తెలిసి మనుషులు మనుషులను తిన్న ఉదంతం ఇదేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.