Begin typing your search above and press return to search.

ప్రభుత్వ ఉపాధ్యాయులకు హైకోర్టు షాక్

By:  Tupaki Desk   |   18 Jan 2022 5:30 PM GMT
ప్రభుత్వ ఉపాధ్యాయులకు హైకోర్టు షాక్
X
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులకు రాష్ట్ర హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోనంబర్ 317పై తాము స్టే ఇవ్వలేమని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తేల్చిచెప్పింది.

ఇప్పటికే ఒకసారి తెలంగాణ హైకోర్టు జీవోనంబర్ 317పై ఇలాగే స్పందించింది. తాజాగా ఈరోజు కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపులపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది.

కాగా రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో కొత్త జిల్లాలకు కేటాయించిన ఉద్యోగులు విధుల్లో చేరారని రాష్ట్ర ప్రభుత్వ అదనపు ఏజీ రాష్ట్ర హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఈ విషయంలో వచ్చిన పిటీషన్లపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది.

కొత్త జిల్లాల్లో ఉపాధ్యాయుల కేటాయింపులపై హైకోర్టు ఇచ్చే తీర్పుకు లోబడి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం సూచించింది. కాగా ఈ కేసులో వచ్చిన పిటీషన్లపై విచారణను ఏప్రిల్ 4వ తేదీకి రాష్ట్ర హైకోర్టు వాయిదావేసింది.