Begin typing your search above and press return to search.

షర్మిలా మీడియా ఫోకస్ కోల్పోయారా?

By:  Tupaki Desk   |   15 May 2021 3:30 PM GMT
షర్మిలా మీడియా ఫోకస్ కోల్పోయారా?
X
వైఎస్ షర్మిల. ఈ ఆంధ్రా ఆడబిడ్డ తెలంగాణలో రాజకీయం చేయమొదలుపెట్టిన క్షణాలు ఏమాత్రం బాగున్నట్టు లేవు. షర్మిల అలా రాజకీయం మొదలుపెట్టగానే ఇలా కరోనా వైరస్ సెకండ్ వేవ్ మొదలైంది. దీంతో లాక్ డౌన్ వచ్చి అందరూ ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితులు దాపురించాయి.

ఒక నెల క్రితం తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశించిన వై.ఎస్.శర్మిల మంచి మీడియా కవరేజీని తొలినాళ్లలో పొందేవారు. షర్మిలా శిబిరంలో కార్యకలాపాలను మీడియా గమనించేది.. హైలెట్ చేసేది. ఏదో ఒకదానిపై అప్డేట్ ను నివేదించేది. కానీ ఇప్పుడా విషయాలు తీవ్రంగా మారిపోయాయి.

ఇదంతా తెలంగాణ కేబినెట్ నుంచి ఈటల రాజేందర్‌ను తొలగించడంతో ప్రారంభమైంది. అకస్మాత్తుగా ప్రజలు మీడియా దృష్టి ఈటల తదుపరి దశ.. తెలంగాణ రాజకీయాల్లో సాధ్యమయ్యే మార్పులపై పడింది.

ఇక ఆ ఎపిసోడ్ ముగియగానే, కరోనా సెకండ్ వేవ్ చుట్టేసింది. ఇప్పుడు సెకండ్ వేవ్ పై రిపోర్టింగ్ చేయడంలో మీడియా పూర్తిగా బిజీగా ఉంది. పెరుగుతున్న కేసులు.. లాక్డౌన్ విధించడంతో తెలంగాణలో విషయాలు తీవ్రంగా మారాయి. వీటన్నిటి మధ్య, మీడియా కవరేజ్ పూర్తిగా మారిపోయింది. అస్సలు వైఎస్ షర్మిల పార్టీని పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. ఆ పార్టీ వ్యవహారాలు మీడియాలో రావడం లేదు.

ఇప్పుడు ప్రెస్‌ను ఆకర్షించడానికి ఆమె వేరే పని చేయాల్సిన అవసరం ఏర్పడింది. కానీ ఈ కరోనా కల్లోలంలో అది సాధ్యం కాదు.. ఇంతలో షర్మిలా బాధలో ఉన్న ప్రజలకు కోవిడ్ హెల్ప్‌లైన్‌ను ప్రకటించింది. ప్రజలకు ఆన్ లైన్ ద్వారా సాయం చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే కోవిడ్ కల్లలంతో షర్మిల ఈ ప్రయత్నం కూడా సరైన మీడియా కవరేజీని పొందలేదు.