Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో ఉన్నోళ్లు గట్టోళ్లే!?

By:  Tupaki Desk   |   5 March 2021 4:27 AM GMT
హైదరాబాద్ లో ఉన్నోళ్లు గట్టోళ్లే!?
X
హైదరాబాదీలు చాలా గట్టివాళ్లుగా మారారు. ఎందుకంటే కరోనా భయానికి వణికిపోయి మొదట్లో కంగారు పడ్డ హైదరాబాద్ ప్రజలు ఇప్పుడు కరోనా ఇమ్యూనిటీని సాధించారు.దాదాపు సగం జనాభా కరోనాను తెలియకుండానే జయించడం విశేషం.

కరోనా వైరస్ దాదాపుగా ప్రతీ ఇంటిని టచ్ చేసినట్లుగా అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదీలు అదృష్టవంతులనే చెప్పాలి... చాలా మందికి కరోనా వచ్చిపోయిందని.. టెస్టులు చేయించుకున్నవారు.. చేయించుకోని వారు.. లక్షణాలు కనిపించని వారిలోనూ కరోనా వచ్చిపోయిందని తేలింది. హైదరాబాదీలకు తెలియకుండానే కరోనా వచ్చేసి వెళ్లిపోయిందని తాజాగా సీసీఎంబీ రిపోర్టులో తేలింది. వారంతా కరోనా ఇమ్యూనిటీని సాధించేశారు.

హైదరాబాద్ నగరంలో ప్రతీ ఇద్దరిలో ఒకరికి కరోనా వచ్చిందని సీసీఎంబీ పరిశోధనలో తేలింది. అంటే దాదాపు సగం మందికి కరోనా వచ్చింది పోయిందట.. తాజాగా వార్డుకు 300 మంది చొప్పున సీసీఎంబీ సర్వే కోసం శాంపిల్స్ సేకరించింది. 10 ఏళ్ల పిల్లల నుంచి 90 ఏళ్ల వృద్ధుల వరకు ఈ సర్వేలో పాల్గొనగా.. కొన్ని వార్డుల్లో 70శాతం, మరొకొన్ని వార్డుల్లో 30శాతం మందిలో యాంటీబాడీస్ గుర్తించారు. సగటున 50-60శాతం మందిలో యాంటీబాడీస్ కనుగొన్నట్లు సీసీఎంబీ వెల్లడించారు.

పురుషుల్లో కంటే మహిళల్లో అత్యధిక యాంటీబాడీస్ ఉన్నట్లు సర్వేల్లో తేలింది. మహిళల్లో 56శాతం యాంటీబాడీస్ ఉంటే.. పురుషుల్లో 53శాతం యాంటీబాడీస్ ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. మొత్తంగా చూస్తే 75శాతం మందికి కరోనా వచ్చినట్లు కూడా తెలియలేదని సర్వే చెబుతోంది.

కరోనా బారినపడ్డ కుటుంబాల్లో 78శాతం మందికి యాంటీబాడీస్ ఉత్పత్తి అయినట్లు.. 68శాతం మందికి సమూహాల ద్వారా వైరస్ వచ్చి పోయినట్లు అధ్యయనంలో తేలింది.

హైదరాబాద్ లోని చిన్న కుటుంబాల్లోని వారికి, చిన్న చిన్న గదుల్లో నివాసముండే వారికి కరోనా వ్యాప్తి తక్కువగా ఉన్నట్లు సర్వేలో తేలింది. దీన్ని బట్టి హైదరాబాదీలు హెర్డ్ ఇమ్యూనిటీ సాధించారని తేల్చారు. అంటే హైదరాబాద్ లోని ప్రతీ ఇంటిలో ఒకరు కరోనా బారినపడ్డారని ఈ సర్వేలో తేలింది.