Begin typing your search above and press return to search.

ఢిల్లీ ఎయిమ్స్ పై హ్యాకర్ల దాడి.. 200 కోట్లు డిమాండ్

By:  Tupaki Desk   |   28 Nov 2022 4:09 PM GMT
ఢిల్లీ ఎయిమ్స్ పై హ్యాకర్ల దాడి.. 200 కోట్లు డిమాండ్
X
ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)పై హ్యాకర్లు పంజా విసిరారు. సర్వర్ వరుసగా ఆరో రోజు కూడా పనిచేయకపోవడంతో హ్యాకర్లు రూ. 200 కోట్ల క్రిప్టోకరెన్సీని డిమాండ్ చేసినట్లు అధికారిక వర్గాలు సోమవారం తెలిపాయి. ఈ మొత్తాన్ని క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లించాలని వారు కోరుతున్నారని తెలిసింది. గత ఆరు రోజులుగా ఇక్కడి సర్వర్లు నిలిచిపోవడంతో ఆస్పత్రిలోని ప్రక్రియ అంతా మాన్యువల్ గానే జరుగుతోంది.

బుధవారం ఉదయం సర్వర్లు హ్యాక్ అయినట్టు గుర్తించారు. సుమారు 3-4 కోట్ల మంది రోగుల డేటా ఇందులో ఉందని ఆస్పత్రివర్గాలు భయపడుతున్నాయి.. సర్వర్ డౌన్‌గా ఉన్నందున అత్యవసర, ఔట్ పేషెంట్, ఇన్‌పేషెంట్ మరియు లేబొరేటరీ విభాగాలలో పేషెంట్ కేర్ సేవలు మాన్యువల్‌గా నిర్వహించబడుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇండియా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ , ఢిల్లీ పోలీసులు , హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధులు దాడిపై దర్యాప్తు చేస్తున్నారు. దోపిడీ ,సైబర్ టెర్రరిజం కేసును నవంబర్ 25న ఢిల్లీ పోలీసు ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ యూనిట్ లో నమోదు చేసింది.

దర్యాప్తు సంస్థల సూచనల మేరకు ఆసుపత్రిలోని కంప్యూటర్లలో ఇంటర్నెట్ సేవలను బ్లాక్ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఎయిమ్స్ సర్వర్‌లో మాజీ ప్రధానులు, మంత్రులు, బ్యూరోక్రాట్‌లు మరియు న్యాయమూర్తులతోపాటు పలువురు వీఐపీల డేటాను భద్రపరిచారు.

"క్రిప్టోకరెన్సీలో సుమారు రూ. 200 కోట్లను హ్యాకర్లు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి" అని తెలిపారు. ఇ-హాస్పిటల్ కోసం ఎన్ఐసీ ఇ-హాస్పిటల్ డేటాబేస్ , అప్లికేషన్ సర్వర్లు పునరుద్ధరించబడ్డాయి. ఎన్ఐసీ బృందం ఎయిమ్స్ లో ఉన్న ఇతర ఇ-హాస్పిటల్ సర్వర్‌ల నుండి మాల్ వేర్ లను తొలగించి క్లీన్ చేశారు. ఇవి ఆసుపత్రి సేవలను అందించడానికి ఉపయోగపడుతున్నాయని తెలిపారు.

ఇ-హాస్పిటల్ సేవలను పునరుద్ధరించడానికి ఏర్పాటు చేసిన నాలుగు భౌతిక సర్వర్లు డేటాబేస్‌లు మరియు అప్లికేషన్‌ల కోసం స్కాన్ చేసి సిద్ధం చేయబడ్డాయి. అలాగే ఎయిమ్స్ నెట్‌వర్క్ శానిటైజేషన్ పురోగతిలో ఉంది. సర్వర్‌లు మరియు కంప్యూటర్‌ల కోసం యాంటీవైరస్ పరిష్కారాలు చేశారు. ఇది 5,000 కంప్యూటర్లలో దాదాపు 1,200 కంప్యూటర్లలో ఇన్‌స్టాల్ చేయబడింది. 50 సర్వర్‌లలో ఇరవై స్కాన్ చేయబడ్డాయి. ఈ కార్యాచరణ 24 గంటలూ కొనసాగుతోంది.

"నెట్‌వర్క్ యొక్క పూర్తి ప్రక్షాళన మరో ఐదు రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇ-హాస్పిటల్ సేవలను దశలవారీగా అందుబాటులోకి తీసుకురావచ్చు. అత్యవసర, ఔట్ పేషెంట్, ఇన్‌పేషెంట్, లేబొరేటరీ మొదలైన సేవలతో సహా పేషెంట్ కేర్ సేవలు మాన్యువల్ మోడ్‌లో కొనసాగుతున్నాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.