Begin typing your search above and press return to search.

జ్ఞానవాపి మసీదు కేసు: సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

By:  Tupaki Desk   |   19 May 2022 7:33 AM GMT
జ్ఞానవాపి మసీదు కేసు: సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు
X
దేశవ్యాప్తంగా ఇప్పుడు 'జ్ఞానవాపి' మసీదు వివాదం ముసురుకుంటోంది. మసీదు ప్రాంగణంలో ఉన్న బావిలో శివలింగ్ లభ్యమవడం సంచలనం రేపుతోంది. దీనిపై సుప్రీంకోర్టు వరకూ వివాదం చేరింది. వారణాసి కోర్టులో ప్రస్తుతం కేసు విచారణ సాగుతోంది. దీంతో దీనిపైనే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కేసుపై ఇవాళ విచారణ జరుగుతోందని.. కోర్టు నుంచి స్పష్టత వస్తుందని అందరూ అనుకుంటున్నారు. కానీ కేసుపై విచారణను శుక్రవారానికి అత్యున్నత ధర్మాసనం వాయిదా వేసింది.

వారణాసి ట్రయల్ కోర్టులో జరగాల్సిన విచారణపైనా స్టే విధించింది. దీంతో ఇవాళ వారణాసి కోర్టులో కూడా విచారణ జరగదు. రేపు దీనిపై క్లారిటీ వస్తుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సుప్రీంకోర్టే జ్ఞానవాపి కేసుపై విచారణ చేపట్టనుంది.

దేశవ్యాప్తంగా ఈ కేసు వల్ల విద్వేశాలు రగులుతున్నాయని.. చాలా వివాదాలు రాజేస్తున్నారని.. అందువల్ల ఈ కేసును అత్యవసరంగా విచారించాలని సుప్రీంకోర్టులో పలువురు విజ్ఞప్తి చేశారు. దీంతో సుప్రీంకోర్టు ఈ విచారణను రేపటికి వాయిదా వేసింది. వారణాసి కోర్టులో తీర్పులో రెండు అంశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. గురవారానికి వాయిదా వేసింది.

మసీదులో పురాతన శివలింగం ఉన్నట్టే నివేదిక కోర్టులో సమర్పించారు.. ప్రఖ్యాత జ్ఞాన్ వాపి మసీదు సముదాయం వద్ద చివరి రోజు సర్వే సందర్భంగా 'శివ లింగం' కనిపించిందని.. ఆ ప్రాంతాన్ని సీల్ చేయాలని వారణాసి కోర్టు సోమవారం జిల్లా మేజిస్ట్రేట్ ను ఆదేశించింది. ఆ ప్రాంతానికి ఎవరినీ ప్రవేశించేందుకు అనుమతివ్వద్దని స్పష్టం చేసింది.సీల్డ్ ఏరియా భద్రతకు డీఎం, పోలీస్ కమిషనర్, పోలీస్ కమిషనరేట్, సీఆర్పీఎఫ్ కమాండెంట్ వారణాసి బాధ్యత వమిస్తారని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో హిందూ పిటీషనర్ అయిన సోహన్ లాల్ ఆర్య , సర్వే కమిటీ కాంప్లెక్స్ వద్ద శివలింగాన్ని కనుగొన్నట్లు పేర్కొన్నారు.

మసీదు సర్వే కోసం కోర్టు కమిషన్ తోపాటు వచ్చిన ఆర్య, తమకు ఆధారాలు దొరికాయని పేర్కొన్నారు. శివలింగం కనిపించిందని.. ఎవరికోసమైతే నంది ఇప్పటివరకూ ఎదురుచూస్తున్నాడో ఆయనే దర్శనమిచ్చాడని తెలిపారు.

జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శివలింగ బయటపడిన ప్రాంతాన్ని సరంక్షించాలని యూపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఈనెల 17న ఆదేశించింది. అదే సమయంలో ముస్లింలు నమాజ్ చేసుకునేందుకు ధర్మాసనం అనుమతించింది. తాజాగా రేపటికి విచారణను వాయిదా వేసింది.

-అసలు వారణాసి జ్ఞానవాపి మసీదు వివాదం ఏంటి?

మొగల్ చక్రవర్తుల కాలంలో ఔరంగజేబు పాలనలో జ్ఞానవాపి శివాలయాన్ని కూల్చేసి అక్కడ మసీదును నిర్మించారనే ఆరోపణలున్నాయి. అయితే ఇందుకు అనుగుణంగానే మసీదు వెనుకాల దేవాలయానికి సంబంధించిన స్తంభాలు ఉండడంతో హిందువుల దేవాలయాన్ని కూల్చేసి మసీదు నిర్మించారని ఆరోపిస్తున్నారు. కొన్ని హిందూ సంస్థలు మసీదును హిందువులకు అప్పగించాలని కోరుతున్నారు.అంతకుముందు ఢిల్లీకి చెందిన ఐదుగురు మహిళలు జ్ఞానవాపి మసీదు వెలుపల గోడపై హిందూ దేవతల విగ్రహాలున్నాయని.. తమకు పూజ చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీంతో ఈ వివాదం పతాకస్థాయికి చేరింది. కోర్టు కలుగజేసుకొని దీనిపై వీడియోగ్రఫీ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేవించింది. దీంట్లో భాగంగానే సర్వేను కొనసాగించాలని వారణాసి కోర్టు తీర్పునిచ్చింది. ఈ సర్వే ప్రకారం ఇది హిందువులకు చెందుతుందా? మసీదుగానే పరిగణిస్తారా? అన్నది వేచిచూడాలి.