Begin typing your search above and press return to search.

తప్పుడు రేప్ కేసు : అబ్బాయికి రూ.15 లక్షల పరిహారం ఇవ్వబోతున్న అమ్మాయి !

By:  Tupaki Desk   |   22 Nov 2020 1:30 AM GMT
తప్పుడు రేప్ కేసు :  అబ్బాయికి రూ.15 లక్షల పరిహారం ఇవ్వబోతున్న అమ్మాయి !
X
అసలు ఈ సమాజంలో ఏం జరుగుతుందో , సమాజం ఎటువైపు వెళ్తుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అబ్బాయిలు అమ్మాయిని మోసం చేశాడని మనం తరచుగా వింటుంటాం కానీ, ఓ అమ్మాయి యువకుడి పై తప్పుడు రేప్ కేసు పెట్టి , అతను మానసిక క్షోభ అనుభవించేలా చేసింది. అయితే , ఆ యువతి పెట్టింది తప్పుడు రేప్ కేసు అని తెలియడంతో చెన్నైలోని న్యాయస్థానం ఆ యువకుడికి విముక్తి కల్పించింది. అంతేకాకుండా, పరువు నష్టంగా సదరు యువకుడికి కేసు పెట్టిన అమ్మాయి కుటుంబం నుంచి 15 లక్షల పరిహారం కూడా ఇప్పించింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే .. తమిళనాడుకు చెందిన సంతోష్ అనే యువకుడి కుటుంబం, ఆ అమ్మాయి కుటుంబాల ఇళ్లు పక్కపక్కనే ఉండేవి. వారిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో సంతోష్‌తో ఆ యువతి పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయం తీసుకున్నాయి. కానీ, కొన్ని రోజుల తర్వాత ఆ కుటుంబాల మధ్య ఆస్తి వివాదాలు రావడంతో సంతోష్ కుటుంబం వేరే చోటుకి వెళ్లి అక్కడే నివసిస్తోంది. ఐతే , ఆ సమయంలో ఆ యువతి గర్బం దాల్చడంతో ఆమె కడుపులో పుట్టబోయే బిడ్డకు సంతోష్ కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఆమెను పెళ్లి చేసుకోవాలని చెప్పారు. అయితే దానికి నాకేం సంబంధం లేదని ఆ యువకుడు వాదించాడు.

యువతి తల్లిదండ్రులు అతడిపై అత్యాచారం కేసు పెట్టారు. దీంతో 2009 నవంబరులో అరెస్టయిన సంతోష్ 95 రోజులు జ్యుడీషియల్ కస్టడీలో వున్నాడు. 2010 ఫిబ్రవరి 12న బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ లోగా అతడిపై కేసు పెట్టిన యువతి ఓ పాపకు జన్మనిచ్చింది. అనంతరం ఆ పాపకు డీఎన్ ‌ఏ పరీక్షలు చేయగా, ఆమె తండ్రి సంతోష్ కాదని తేలింది. 2016, ఫిబ్రవరి 10న న్యాయస్థానం అతడిని నిర్దోషిగా తేల్చి తీర్పు చెప్పింది. అనంతరం తనపై అన్యాయంగా కేసు పెట్టి తన జీవితాన్ని నాశనం చేశారని ఆ యువకుడు పరువు నష్టం దావా వేశాడు. రూ.30 లక్షల పరిహారం ఇప్పించాలని కోర్టును ఆశ్రయించాడు. దీనిపై కూడా సుదీర్ఘ విచారణ చేపట్టిన న్యాయస్థానం తాజాగా రూ.15 లక్షల పరిహారం చెల్లించాలని ఆ మహిళ కుటుంబాన్ని ఆదేశాలు జారీచేసింది. దీనితో మరో గత్యంతరం లేక ఆ పరిహారం చెల్లించడానికి ఒప్పుకుంది.