Begin typing your search above and press return to search.
మృగాళ్ల ఆటలిక ఆగవా? తెలంగాణలో బాలికపై గ్యాంగ్ రేప్
By: Tupaki Desk | 25 Oct 2020 9:10 AM GMTమదమెక్కిన మృగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట పడడం లేదు. ముక్కు మొహం తెలియని బాలికలపై అత్యాచారాలు పాల్పడుతూ వారినిచిదిమేస్తున్నారు.తెలంగాణలో మరో మైనర్ బాలిక పై గ్యాంగ్ రేప్ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దిశ హత్యాచార కేసులో రేపిస్టులను దారుణంగా ఎన్ కౌంటర్ చేసి చంపినా వీరిలో భయం లేదేమో గ్యాంగ్ రేప్ చేసే సమయంలో స్మార్ట్ ఫోన్లతో వీడియోలు కూడా తీసుకున్నారు. ఈ వీడియోలు ఒకరికొకరు షేర్ చేసుకోవడంతో ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఇప్పుడు తెలంగాణలో సంచలనంగా మారింది.
జగిత్యాల జిల్లా మెట్పల్లి లోని ఓ ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలికపై ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కొద్ది రోజులుగా ఈ బాలికపై కన్నేసిన నీచులు అవకాశం కోసం ఎదురు చూసారు. బాలిక ఒంటరిగా దొరకగానే ఆమెను తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. అంతటితో ఊరు కోకుండా ఈ దారుణాన్ని స్మార్ట్ ఫోన్ లలో వీడియోలు కూడా తీసుకున్నారు. వాటిని భద్ర పరుచుకున్నారు. ఆ తర్వాత ఈ వీడియోలను ఒకరినొకరు షేర్ చేసుకోవడంతో చాలామంది వద్దకు చేరాయి. అవి కాస్త సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వైరల్ గా మారి విషయం బయటకు పొక్కింది. బాలిక బంధువులు ఐదుగురు కామాంధుల పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేపట్టారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లి లోని ఓ ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలికపై ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కొద్ది రోజులుగా ఈ బాలికపై కన్నేసిన నీచులు అవకాశం కోసం ఎదురు చూసారు. బాలిక ఒంటరిగా దొరకగానే ఆమెను తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. అంతటితో ఊరు కోకుండా ఈ దారుణాన్ని స్మార్ట్ ఫోన్ లలో వీడియోలు కూడా తీసుకున్నారు. వాటిని భద్ర పరుచుకున్నారు. ఆ తర్వాత ఈ వీడియోలను ఒకరినొకరు షేర్ చేసుకోవడంతో చాలామంది వద్దకు చేరాయి. అవి కాస్త సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వైరల్ గా మారి విషయం బయటకు పొక్కింది. బాలిక బంధువులు ఐదుగురు కామాంధుల పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేపట్టారు.